మాజీ ఎంపీ నందిగం సురేష్‌పై మర్డర్‌ కేసు
x

మాజీ ఎంపీ నందిగం సురేష్‌పై మర్డర్‌ కేసు

మాజీ ఎంపీ నందిగం సురేష్‌ మీద మరో కేసు బుక్‌ చేశారు. మహిళ హత్య కేసులో సురేశ్‌కు 14 రోజుల రిమాండ్‌ విధించారు.


వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్‌ మీద కేసులు మీద కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఎంపీ నందిగం సురేశ్‌ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్‌ నిందితుడిగా ఉన్నారు. ఇదే కేసుకు సంబంధించి గుంటూరు జైల్లో ఉన్నారు. తాజాగా మర్డర్‌ కేసు తెరపైకి వచ్చింది. వెలగపూడిలో మరియమ్మ అనే మహిళ హత్య కేసులో నిందితుడిగా కేసు నమోదు చేశారు. ఈ మహిళ హత్య కేసులో నందిగం సురేశ్‌ను పోలీసులు అరెస్టు చేసి మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన కోర్టు సురేశ్‌కు అక్టోబరు 21 వరకు రిమాండ్‌ విధించింది.

ఇదిలా ఉంటే మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టు అయిన నందిగం సురేష్‌ ప్రస్తుతం గుంటూరు జైల్లో ఉన్నారు. ఇటీవల ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్‌ విధించింది. తాజాగా ఓ మహిళ హత్య కేసులో నందిగం సురేష్‌ను అరెస్టు చేశారు. 2020లో తుళ్లూరు మండలం వెలగపూడిలో మరియమ్మ అనే మహిళ హత్యకు గురైంది. ఈ హత్య కేసుకు సంబంధించి ఇటీవల పోలీసులు పీటీ వారెంట్‌ కోరగా, కోర్టు అనుమతి ఇచ్చింది.


Read More
Next Story