సుప్రీం కోర్టు చెప్పినా వక్రీకరిస్తూనే ఉన్నారు:మాజీ సీఎం జగన్‌
x

సుప్రీం కోర్టు చెప్పినా వక్రీకరిస్తూనే ఉన్నారు:మాజీ సీఎం జగన్‌

సీఎం చంద్రబాబు, టీడీపీ శ్రేణులపై జగన్‌ మండిపడ్డారు. ఇంకా వక్రీకరిస్తూనే ఉన్నారని ఎక్స్‌ వేదికగా విమర్శలు గుప్పించారు.


తిరుమల తిరుపతి లడ్డూ వివాదంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించినా, సీఎం చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినా, సీఎం చంద్రబాబు, టీడీపీలు ఇంకా వక్రీకరించే దుర్మార్గానికి తెగబడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు తీర్పు అనంతరం ఆయన శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబు, టీడీపీ, కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై తీవ్ర స్థాయిలోనే మండిపడ్డారు. అయితే సామాజిక మాధ్యమమైన ఎక్స్‌ వేదికగా శనివారం స్పందించారు. లడ్డూ వివాదంలో సుప్రీం కోర్టు సీఎం చంద్రబాబుకు, ఆయన ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినా వారి తీరు మార లేదని, సీఎం చంద్రబాబు, టీడీపీ శ్రేణులు వక్రీకరిస్తూనే ఉన్నారని, రాజకీయాలు చేస్తూనే ఉన్నారని విమర్శిస్తూ ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు.


Read More
Next Story