
చీకటి అధ్యాయాల్లో 'ఎమర్జెన్సీ' ఒకటి
జాతీయ పాలిటిక్స్కు సంబంధించిన అంశాలు, ఘటనలపైన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తరుచుగా స్పందిస్తుంటారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం, 1975లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ మీద స్పందించారు. స్వతంత్ర భారత దేశ చరిత్రలో 'ఎమర్జెన్సీ' అనేది ఒక చీటకి అధ్యాయమని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా జనసేన పార్టీ ఉంది. ఇదే కూటమిలో టీడీపీ కూడా ఉంది. జనతాదళ(యునైటెడ్) వంటి ఇతర పార్టీలు కూడా ఈ కూటమిలో ఉన్నాయి. ఈ కూటమిలో ఉన్న సీనియర్ రాజకీయ నాయకులైన సీఎం చంద్రబాబు, సీఎం నితీష్కుమార్ల కంటే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తరచుగా జాతీయ రాజకీయాలు, ముఖ్యమైన సంఘటనలపై తనదైన శైలిలో విమర్శలు చేస్తుంటారు. ఎమర్జెన్సీ విధించి నేటికి సరగ్గా 50ఏళ్లు అవుతున్న సందర్భంగా పవన్ కల్యాణ్ దీనిపై స్పందించారు.
‘ఎమర్జెన్సీ’ 25–06–1975 స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయాలలో ఒకటి. ఇది కేవలం ఒక రాజకీయ సంఘటన మాత్రమే కాదు. ఇది రాజ్యాంగానికి ప్రత్యక్ష ద్రోహం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం. అంతేకాదు అప్పటి కాంగ్రెస్ నాయకత్వ అధికార దాహానికి చిహ్నం. ఎమర్జెన్సీలో మీడియా మూగోబోయింది. ప్రతిపక్షాల గొంతును నొక్కారు. ప్రాథమిక హక్కులను కాలరశారు. లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్, అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్.కె. అద్వానీ, జార్జ్ ఫెర్నాండెజ్, మొరార్జీ దేశాయ్ వంటి అనేక మంది గొప్ప నాయకులు ప్రజాస్వామ్య రక్షణ కోసం నిలబడి జైలు పాలయ్యారు. అంటూ నాటి ఎమర్జెన్సీపై పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు.
ఈ రాజ్యాంగ ద్రోహానికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా.. నియంతృత్వానికి వ్యతిరేకంగా నిర్భయంగా నిలబడి, మన ప్రజాస్వామ్య గౌరవాన్ని నిలబెట్టిన వారి త్యాగాలను గుర్తుచేసుకోవడానికి ‘సంవిధాన్ హత్య దివాస్’గా పాటించాలన్నారు. అణచివేతకు వ్యతిరేకంగా నిలబడిన నాయకులు చేసిన త్యాగాలను, అలాగే లక్షలాది మంది గొంతులు నొక్కబడిన వేదనను గుర్తుచేసుకుందాం. నేటికీ, రాజకీయాల పేరుతో మన రాజ్యాంగాన్ని రాజీ పడే ఏ ప్రయత్నానికైనా దూరంగా ఉండాలి. అంటూ బుధవారం పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
Next Story