ఆర్థిక ఉగ్రవాదం అత్యంత ప్రమాదకరం -చంద్రబాబు
x

ఆర్థిక ఉగ్రవాదం అత్యంత ప్రమాదకరం -చంద్రబాబు

రౌడీలు రాజకీయ ముసుగువేసుకొని వస్తున్నారు.అందుకే జాగ్రత్త ఉండాలన్న ముఖ్యమంత్రి


రాష్ట్రంలో ప్రజల భద్రతే తమ ప్రభుత్వ ప్రధమ లక్ష్యం కావాలని ,అదే ఆశయంతో పనిచేస్తున్నామని టీడీపీ అధినేత,ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు.ఈ విషయంలో మంత్రులు , టీడీపీ ప్రజాప్రతినిధులు రాజీపడవద్దని సూచించారు.రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని , రౌడీలు రాజకీయ ముసుగులో రాజకీయాలు చేస్తున్నారని పరోక్షంగా జగన్ వైఖరిని తప్పుబట్టారు.మరోపక్క ఆర్థిక ఉగ్రవాదం పెరుగుతోందని , దేశ ఆర్థిక అభివృద్దికి అది అత్యంత ప్రమాదకరమని చంద్రబాబు తెలిపారు.

తెలుగుదేశం విస్తృత స్థాయిసమావేశంలో చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్థేశం చేశారు.నేరగాళ్ల ముసుగుతీసి ప్రజల ముందుంచుతామన్న చంద్రబాబు,టీడీపీ ప్రజాప్రతినిధులు ,నేతలు అప్రమత్తంగా వుండాలని పిలుపునిచ్చారు.ఆర్థిక ఉగ్రవాదుల నుంచి రాష్ట్రాన్ని కాపాడడానికి ప్రజలు అధిక మెజార్టీతో కూటమిని గెలిపించిన విషయాన్ని మర్చిపోవద్దని ఆయన అన్నారు.ప్రస్తుతం కూటమి ప్రభుత్వం విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బైట పడేసి వికాసం వైపు నడుస్తోందని తెలిపారు.
వివేకానంద రెడ్డి హత్యోదంతాన్ని కూడా చంద్రబాబు ఈ సమావేశం లో ప్రస్తావించారు.దారుణంగా హత్య చేసి గుండెపోటని నమ్మించారని , తానుకూడా ఆ వార్త విన్నప్పుడు సాధారణ మరణమనే భావించానని , లేకుంటే పరిస్థితి వేరేలా వుండేదని స్పష్టం చేశారు.వివేకా హత్యను ఒక కేస్ స్టడీగా తీసుకొని అందరం అప్రమత్తంగా వుండాలన్నారు.రైట్ టైంలో రైట్ డెసిషన్ అవసరమని చంద్రబాబు తెలిపారు.ఇప్పుడు రాజకీయాలలో కొత్త వురవడి సృష్టిస్తున్నారని , రౌడీలను, నేరగాళ్లను పరామర్శిస్తున్న తీరు బాధాకరమన్నారు.రాష్ట్ర అభివృద్దికి ఆటంకంగా మారే వారిని ఎట్టి పరిస్థితులలోనూ వదిలి పెట్టేది లేదని చంద్రబాబు హెచ్చరించారు.2019లో గెలిస్తే పరిస్థితి వేరుగా వుండేదని చెప్పుకొచ్చారు.


Read More
Next Story