
స్మార్ట్ రేషన్ కార్డుల జారీకి ముహుర్తం ఫిక్స్
పాత రేషన్ కార్డుల జారీ స్ధానంలో అత్యాధునిక ఫీచర్లతో ఆగస్టు 25 నుంచి కొత్త రేషన్ కార్డులు
ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ కోసం తేదీని ప్రభుత్వం ఖరారు చేసింది.రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న లబ్దిదారులకు ఇవాళ మంత్రి నాదేండ్ల గుడ్ న్యూస్ అందించారు.ఇప్పటికే పాత రేషన్ కార్డుల జారీ స్ధానంలో అత్యాధునిక ఫీచర్లతో రేషన్ కార్డులు తీసుకొస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం ,ఇందుకు అనుగుణంగా వాటి జారీ తేదీని ఖరారు చేసింది.ఆగస్టు 25 నుంచి వారం రోజుల పాటు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.క్యూఆర్ కోడ్లతో డిజిటల్ రేషన్కార్డులు ఉంటాయన్నారు. డెబిట్ కార్డుల తరహాలో కొత్త రేషన్ కార్డులు ఉంటాయని,డైనమిక్ కీ రిజిస్టర్ తో వీటిని అనుసంధానిస్తామన్నారు. ప్రతీ లావాదేవీ జరగగానే తమ ఆఫీసులో తెలిసిపోతుందని మంత్రి తెలిపారు.
రేషన్ కార్డుల కోసం 16 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని, ఇందులో 15.32 లక్షల దరఖాస్తుల్ని ఆమోదించినట్లు మనోహర్ తెలిపారు. 9.87 లక్షల మందికి కొత్తగా పేర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించామన్నారు. ఐదేళ్లలోపు, 80 ఏళ్లు దాటినవారికి ఈకేవైసీ అవసరంలేదని వెల్లడించారు. ప్రతినెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ ఉంటుందన్నారు. 25నుంచి 30వ తేదీ వరకు వృద్ధులకు రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నట్లు తెలిపారు.కొత్త రేషన్కార్డులపై రాజకీయ నేతల ఫొటోలు ఉండవని ఆయన తెలిపారు.
Next Story