తిరుమల మెట్లోత్సవం- 3,500 మందితో భక్తి ప్రవాహం
x

తిరుమల మెట్లోత్సవం- 3,500 మందితో భక్తి ప్రవాహం

అలిపిరి నుండి తిరుమల వరకు భక్తి మార్గం – భక్తులతో కిటకిటలాడిన సప్తగిరులు


శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం అక్టోబర్ 31న (శుక్రవారం) అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగింది. ముందుగా టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి, దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్యులతో కలిసి మెట్లపూజ నిర్వహించారు. అనంతరం మెట్లోత్సవాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. పూర్వం నుంచి ఎందరో మహనీయులు మెట్ల మార్గంలో తిరుమలకు నడిచివెళ్లి స్వామివారిని దర్శించుకున్నట్లు చెప్పారు. అలాంటివారి అడుగుజాడలో నడిచి శ్రీవారి కృపకు అందరూ పాత్రులు కావాలని తితిదే మెట్లోత్సవాన్ని నిర్వహిస్తోందని ఆయన చెప్పారు.


పూర్వం శ్రీపురందరదాసులు, శ్రీ వ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్‌ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో తిరుమల కొండలను అధిరోహించి స్వామివారి వైభవాన్ని దశదిశలా వ్యాప్తి చేశారని వివరించారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో టీటీడీ మెట్లోత్సవాన్ని నిర్వహిస్తోందని తెలిపారు.


శ్రీఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ, వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భజన మండళ్ల సభ్యులు సాంప్రదాయ భజనలు చేసుకుంటూ సప్తగిరులను అధిరోహిస్తున్నట్టు చెప్పారు. భజన మండళ్ల సభ్యులకు తిరుమల ఆస్థాన మండపంలో ధార్మిక శిక్షణ, దాస సాహిత్యంలో సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించినట్లు వివరించారు. ఇక్కడ శిక్షణ పొందిన సభ్యులు తమ ప్రాంతాలకు వెళ్లి భక్తజనావళికి సనాతన ధార్మిక అంశాలపై శిక్షణ ఇస్తారని తెలియజేశారు.


అంతకుముందు భజనమండళ్ల స‌భ్యులు అలిపిరి పాదాలమండపం వద్ద సంప్రదాయబద్ధంగా మెట్లపూజ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి 3,500 మందికిపైగా భజనమండళ్ల సభ్యులు భజనలు చేసుకుంటూ తిరుమలగిరులను అధిరోహించారు.

భక్తిగీతాల నాదంతో అలిపిరి–తిరుమల మార్గం అంతా ఓ పుణ్య ప్రవాహంలా మారిపోయింది.
మెట్లోత్సవం ఎపుడు మొదలయింది?

1. దాస సాహిత్య ప్రాజెక్టును టీటీడీ ప్రారంభించింది 1979లో

పీవీఆర్కే ప్రసాద్ తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు ఈవోగా పనిచేసినపుడు ప్రాజెక్టు మొదలైంది అయితే దీనికి ప్రాధాన్యత మాత్రం 1995లోనే మొదలైందని దాస సాహిత్యం ప్రాజెక్టు డైరెక్టర్ పగడాల ఆనంద తీర్ధాచార్య చెప్పారు. ఈ ఉత్సవాలను నిర్వహించేది ఈ సంస్థయే.

"మోట్లోత్సవం పేరుతు పెద్దఎత్తున ఉత్సవాలు చేయటం, ప్రాజెక్టును, మెట్లోత్సవానికి ప్రాధాన్యత తీసుకురావటం 35 ఏళ్ళుగానే జరుగుతోంది. . పురాణకాలంతో పాటు చరిత్రలో ఉత్తరాధినవాబులు తిరుమల కొండకు నడిచి వెళ్ళినట్లు ప్రాజెక్టు డైరెక్టర్ పగడాల ఆనంద తీర్ధాచార్య చెప్పారు. అయితే దీనికి ఆధారాలు మాత్రం లేవు. పూర్వం రుషులు, ఉత్తరాధి రాజులు తిరుమల మెట్లు ఎక్కేముందు అలిపిరి దగ్గరున్న మెట్లకు పూజలు చేసి ఉత్సవంగా జరిపేవారు. అలిపిరి నుండి తిరుమలకు సుమారు 3 వేల మెట్లున్నా అన్నింటికీ పూజలు చేయరు. కేవలం అలిపిరి దగ్గరున్న పాదాల మండపంలోని పాదాలకు, మొదటి 10 మెట్లకు మాత్రమే పూజలు చేస్తారు. మళ్ళీ మోకాలు మెట్టు దగ్గర రెండో పూజ చేస్తారు. పూజలంటే పసుపు, కుంకుమ, గంధముతో అర్చించి హారతులు ఇచ్చి, కొబ్బరికాయలు కొట్టి శ్రీనివాసుని కీర్తనలతో నడక మొదలుపెడతారు," అని ఆయన చెప్పారు.

ప్రాజెక్టు డైరెక్టరుగా ఆనంద తీర్ధ బాధ్యతలు తీసుకున్న తర్వాత అంటే 20 ఏళ్ళుగా మెట్లోత్సవానికి బాగా ప్రచార్యం కల్పించారు. ఏపీతోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కొంత మహారాష్ట్ర, మరికొంత కేరళ నుండి భక్తులు వస్తున్నారు. పైన చెప్పిన రాష్ట్రాల్లో దాససాహిత్య భజన మండళ్ళను ప్రాజెక్టు ఏర్పాటుచేసింది. ఏపీలో 8400 మండళ్ళు, మహారాష్ట్రలో 100, తమిళనాడులో 50 భజన మండళ్ళున్నాయి.

మెట్లోత్సవానికి భజన మండళ్ళల్లోని భక్తులనే ఎక్కువగా ప్రాజెక్టు ఆహ్వానిస్తుంది. శుక్రవారం మొదలైన మెట్లోత్సవంలో 3500 మంది భక్తులు పాల్గొన్నారు.

ప్రతి మూడునెలలకు జరిగే మెట్లోత్సవం మూడురోజులు వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తారని ఆయన చెప్పారు.

కార్యక్రమం అయిపోయిన తర్వాత భక్తులు వాళ్ళ స్వస్ధలాలకు వెళ్ళి శ్రీనివాసుని మహిమల గురించి వివరిస్తారని డైరెక్టర్ చెప్పారు. పురందరదాసు అంటే దాస పరంపరలో విజయదాసను భృగుమహర్షి అవతారంగా భావిస్తారు. విజయదాస విష్ణువులో ఐక్యం అయిన రోజు శుక్రవారం అందుకనే నిన్న(3110-2025)న మెట్లోత్సవం ప్రారంభమైందని ఆనంద తీర్థ చెప్పారు.

Read More
Next Story