ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
x

ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రలో తమ పార్టీ తరపున పోటీ చేయనున్న ఎంపీ అభ్యర్థుల మూడో జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.


ఆంధ్రలో తమ పార్టీ తరపున లోక్‌సభ ఎన్నికల బరిలో నిలబడనున్న ఎంపీ అభ్యర్థుల మరో జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇందులో తొమ్మిది మంది అభ్యర్థలను వెల్లడించింది. ఈ జాబితాను కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కే వేణుగోపాల్ విడుదల చేశారు. ఈ జాబితాలో ఆంధ్రలోని తొమ్మిది మంది అభ్యర్థులతో పాటు ఝార్ఖండ్‌లో కాంగ్రెస్ తరపున పోటీ చేయనున్న ఇద్దరు అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. గతంలో విడుదల చేసిన తొలి జాబితాలో ఆరుగురు ఎంపీ అభ్యర్థులను రెండో జాబితాలో ఐదుగురు ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్ వెల్లడించింది.

ఆంధ్రలో పోటీ చేయనున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు

శ్రీకాకుళం - పి పరమేశ్వరరావు

అమలాపురం - జంగా గౌతమ్

మచిలీపట్నం - గోల్లు కృష్ణ

ఒంగోలు - ఈద సుధాకర్ రెడ్డి

విజయనగరం - బొబ్బిలి శ్రీను

విజయవాడ - పల్లూరు భార్గవ్

అనంపురం - మల్లికార్జున్ వజ్జల

నంద్యాల - జే లక్ష్మీ నరసింహ యాదవ్

హిందూపురం - బీఏ సమద్ షహీన్

ఝార్ఖండ్ అభ్యర్థులు

గొడ్డ - ప్రదీప్ యాదవ్ (దీపిక పాండే స్థానంలో)

రాంచి - యశస్వినీ సాహే

Read More
Next Story