నేతలకు అభినందనలు..కార్యకర్తలకు హాట్సాఫ్‌
x

నేతలకు అభినందనలు..కార్యకర్తలకు హాట్సాఫ్‌

ఢిల్లీ నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫెరెన్స్‌ నిర్వహించారు.


కడప మహానాడు అద్భుతంగా జరిగింది.. గ్రాండ్‌ సక్సెస్‌ చేశారు.. కడప జిల్లా టీడీపీ నాయకులంతా కలిసికట్టుగా పని చేశారు.. టీడీపీ శ్రేణులంతా కలిసికట్టుగా కడప మహానాడును విజయవంతం చేసినందుకు నాయకులకు అభినందనలు.. కార్యకర్తలకు హాట్సాఫ్‌ సీఎం చంద్రబాబు కితాబిచ్చారు. నాయకులు, కార్యకర్తలు అందరూ ఒక తాటిపైకి వచ్చి కలిసికట్టుగా పని చేస్తే ఏ కార్యక్రమమైనా విజయవంతం అవుతుందని, దానికి కడప మహానాడే నిదర్శనమని చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు, అక్కడ నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర టీడీపీ నాయకులతో శుక్రవారం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులను, ప్రత్యేకించి కడప జిల్లా టీడీపీ శ్రేణులను ఆయన మెచ్చుకున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పదవులల్లో ఇతర నాయకులు కూడా కార్యకర్తల్లా పనిచేశారని, ఇదే స్పూర్తిని భవిష్యత్‌లో కూడా కొనసాగించాలని సూచించారు. కడప మహానాడుకు ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలి రావడం అనేది చాలా సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.

కడప మహానాడులో ప్రవేశ పెట్టిన ఆరు శాసనాలను, వాటి వెనుకున్న నేపథ్యాన్ని, వాటి లక్ష్యాలను, శాసనాల కాన్సెప్ట్‌ను విస్తృత స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి, వాటి గురించి అవగాహన కల్పించాలని నేతలకు సీఎం చంద్రబాబు సూచించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలో చేపట్టిన సంక్షేమ పథకాలు, డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలు, వివిధ అంశాలపై కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల పట్ల ప్రజల్లో సానుకూలత ఉందన్నారు. మహానాడు వేదిక నుంచి ప్రజలకు అన్నీ విషయాలను వివరించామని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసిన వాటిని, రానున్న కాలంలో చేయబోయే కార్యక్రమాలను కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లామని, వాటిపైన ప్రజల్లో చర్చ జరిగే విధంగా టీడీపీ శ్రేణులు దృష్టి సారించాలని సూచించారు.
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు శనివారం కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం ఉదయం ముమ్మిడి మండలం సిహెచ్‌ గున్నేపల్లిలో ఏర్పాటు చేసిన హెలీపాడ్‌లో దిగి, అక్క నుంచి గంటలకు కాట్రేనికోన మండలం చెయ్యారులో ఉపాధి హామీ పథకం కూలీలతో సంభాషించిన అనంతరం లబ్ధిదారులకు పెన్షన్‌ పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజావేదికలో గ్రామస్తులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహిస్తారు. ఆ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసే పనిలో జిల్లా యంత్రాంగం, మంత్రులు నిమగ్నమయ్యారు.
Read More
Next Story