
నేతలకు అభినందనలు..కార్యకర్తలకు హాట్సాఫ్
ఢిల్లీ నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫెరెన్స్ నిర్వహించారు.
కడప మహానాడు అద్భుతంగా జరిగింది.. గ్రాండ్ సక్సెస్ చేశారు.. కడప జిల్లా టీడీపీ నాయకులంతా కలిసికట్టుగా పని చేశారు.. టీడీపీ శ్రేణులంతా కలిసికట్టుగా కడప మహానాడును విజయవంతం చేసినందుకు నాయకులకు అభినందనలు.. కార్యకర్తలకు హాట్సాఫ్ సీఎం చంద్రబాబు కితాబిచ్చారు. నాయకులు, కార్యకర్తలు అందరూ ఒక తాటిపైకి వచ్చి కలిసికట్టుగా పని చేస్తే ఏ కార్యక్రమమైనా విజయవంతం అవుతుందని, దానికి కడప మహానాడే నిదర్శనమని చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు, అక్కడ నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర టీడీపీ నాయకులతో శుక్రవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులను, ప్రత్యేకించి కడప జిల్లా టీడీపీ శ్రేణులను ఆయన మెచ్చుకున్నారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పదవులల్లో ఇతర నాయకులు కూడా కార్యకర్తల్లా పనిచేశారని, ఇదే స్పూర్తిని భవిష్యత్లో కూడా కొనసాగించాలని సూచించారు. కడప మహానాడుకు ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలి రావడం అనేది చాలా సంతోషాన్ని ఇచ్చిందని పేర్కొన్నారు.