
రండి..యోగాలో పాల్గొనండి
ప్రపంచానికి భారత దేశం ప్రసాదించిన ఓ దివ్యమైన వరం యోగా అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.
విశాఖ సముద్ర తీరం ఆర్కే బీచ్లో నిర్వహించే అంతర్జాతీయ యోగా కార్యక్రమానికి రాష్ట్ర ప్రజలను సీఎం చంద్రబాబు ఆహ్వానించారు. జూన్ 21న నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని కోరారు. ఈ కార్యక్రమానికి స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరవుతున్నారని.. ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఆ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆదివారం సీఎం చంద్రబాబు ఆహ్వానం పలికారు.
ప్రపంచానికి భారత దేశం అందించిన ఓ దివ్య వరప్రసాదం యోగా అని అభివర్ణించారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖలో భారీ ఎత్తున నిర్వహిస్తున్నాం. రండి.. ప్రజలంతా వచ్చి పాల్గొనండి.. యోగాను జీవితంలో భాగస్వామ్యం చేసుకుందాం.. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.. అంటూ సీఎం చంద్రబాబు ప్రజలకు సూచించారు.
సీఎం చంద్రబాబు ఏమన్నారంటే..
ప్రపంచానికి భారత దేశం ప్రసాదించిన దివ్య వరంం యోగ. ఆరోగ్యాన్నే కాకుండా ఆయుష్షును పెంచే యోగ మన జీవన విధానం కావాలి. ఈ నెల 21న విశాఖపట్నంలో 11వ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు ముఖ్య అతిధిగా పాల్గొంటున్నారు. రండిం మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. యోగాను జీవితంలో భాగం చేసుకుందాంం ఆరోగ్యంగా జీవిద్దాం.
#Yogandhra2025
— N Chandrababu Naidu (@ncbn) June 15, 2025
ప్రపంచానికి భారత దేశం ప్రసాదించిన దివ్య వరం… యోగ. ఆరోగ్యాన్నే కాకుండా ఆయుష్షును పెంచే యోగ మన జీవన విధానం కావాలి. ఈ నెల 21న విశాఖపట్నంలో 11వ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ప్రధాని శ్రీ… pic.twitter.com/NKdrQ4bafU
Next Story