‘ఒక్కసారి మైక్ ఇచ్చి చూడు’.. సీఎం జగన్‌ను దస్తగిరి ఛాలెంజ్
x

‘ఒక్కసారి మైక్ ఇచ్చి చూడు’.. సీఎం జగన్‌ను దస్తగిరి ఛాలెంజ్

సీఎం జగన్‌పై వివేకా హత్య కేసు అప్రూవర్ దస్తగిరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక్కసారి ప్రజలకు మైక్ ఇచ్చి చూడాలని సవాల్ చేశారు.


ఏపీ సీఎంకు వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ‘ఒక్కసారి ప్రజలకు మైక్ ఇచ్చి వివేకాను ఎవరు హత్య చేయించారు అని అడుగు. ప్రజలే చెప్తారు సమాధానం’’అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనపై జగన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, నోటికి వచ్చిన ఆరోపణ చేస్తున్నారే తప్ప అందులో రవ్వంత కూడా వాస్తవం లేదనంటూ వ్యాఖ్యానించారు. జగన్ ఈరోజు తన నామినేషన్‌ సందర్భంగా పులివెందుల సీఐ చర్చిలో నిర్వహించిన సభలో తనపై చేసిన ఆరోపణలన్నీ సుద్ద అబద్దాలేనని వ్యాఖ్యానించారు. ‘‘ఈ రోజున జై భీమ్రావు పార్టీ నామినేషన్స్ సందర్భంగా జడ శ్రావణ్ కుమార్ రావడం చాలా సంతోషంగా ఉంది. కావాలనే నా నామినేషన్ లేటయ్యేలా చేశారు. అందులో భాగంగానే ఇరోజు మధ్యాహ్నం 2:30 గంటల వరకు నా నామినేషన్‌ను ఆపేశారు. నేను అప్రూవర్‌గా మారినప్పటి నుంచి జగన్ భయంతో వణికిపోతున్నారు. ఇప్పుడు నేను నామినేషన్ వేయడంతో వైసీపీ మొత్తానికి భయం పట్టుకుంది’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Read More
Next Story