ఈ నెల 7న సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన
x

ఈ నెల 7న సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర పెద్దలను కలవనున్నారు. ఈనెల 7న పర్యటన ఖరారైంది. రాష్ట్ర ప్రభుత్వ సమస్యలతో పాటు జగన్ తీరును వారి ద్రుష్టికి తీసుకుపోనున్నారు.


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 7న ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. హస్తినలో ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కొందరు కేంద్ర మంత్రులను కలవనున్నారు.

సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన సందర్భంగా ప్రపంచబ్యాంకు ప్రతినిధులతోనూ సమావేశం కానున్నారు. అమరావతికి నిధుల సాయంపై చర్చించనున్నారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీ సందర్భంగా విశాఖ రైల్వే జోన్, పెండింగ్‌ ప్రాజెక్టులపై చర్చించనున్నారు.
తిరుపతి లడ్డు వివాదం, ఉచిత పథకాల అమలుకు నిధులు వంటి విషయాలు కూడా ప్రధాన మంత్రి భేటీలో విన్నవిస్తారు. ఈనెల 10న మంత్రివర్గం భేటీ కానుంది. కేంద్రం నుంచి వచ్చే సూచనలు సలహాలను కూడా మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు చర్చించే అవకాశం ఉంది.
Read More
Next Story