రాయచోటి అభివృద్ధికి సీఎం చంద్రబాబు హామీ
x

రాయచోటి అభివృద్ధికి సీఎం చంద్రబాబు హామీ

మంత్రి మండిపల్లిని పిలిపించి భరోసా ఇచ్చిన సీఎం చంద్రబాబు.


జిల్లాల పునర్విభజన అంశాలలో భాగంగా రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి సీఎం చంద్రబాబు నాయుడు భరోసా నిచ్చారు. ఈ నేపథ్యంలో సీఎంఓ నుండి ఫోన్ కాల్ రావడంతో, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్యమంత్రిని కలిశారు. ఈ భేటీలో రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్, సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఉన్నారు. రాయచోటి అగ్రగామిగా నిలిచేలా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. రాయచోటిపై తనకున్న అనుబంధం, మమకారం గురించి ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు.

గతంలో రూపొందించిన ప్రణాళికల ప్రకారమే రాయచోటిని ప్రణాళిక బద్దమైన అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. అవసరమైన అన్ని మౌళిక సదుపాయాలు, పరిపాలనా సదుపాయాలతో రాయచోటి మరింత ముందుకు సాగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా, రాయచోటిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి మండిపల్లికి స్పష్టం చేశారు. రాయచోటి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా మరింత కృషి చేస్తానని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు.
Read More
Next Story