సీఎం చంద్రబాబు దళారీగా మారారు: మాజీ మంత్రి కారుమూరి
x

సీఎం చంద్రబాబు దళారీగా మారారు: మాజీ మంత్రి కారుమూరి

మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు కారుమూరి ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. సీబీఐ అంటే చంద్రబాబుకు ఎందుకు అంత భయమన్నారు.


వైఎస్‌ఆర్‌సీపీ రాజ్యసభ ఎంపీలను, నేతలను కొనుగోలు చేసి, ఆ పదవులను పెత్తందారులకు అమ్ముకునే దళారిగా ఏపీ సీఎం చంద్రబాబు మారిపోయారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఆర్‌ కృష్ణయ్య తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అంశంపై కారుమూరి బుధవారం విశాఖలో మీడియాతో మాట్లాడారు.

బీసీలకు వైఎస్‌ జగన్‌ ఎంతో మేలు చేశారని. రాజ్యాధికారం దక్కాలని వైఎస్‌ జగన్‌ లక్ష్యంగా పెట్టుకున్నారని, అందుకే తెలంగాణ వ్యక్తి అయినప్పటికీ కృష్ణయ్యకు పిలిచి మరీ రాజ్యసభ సీటు ఇచ్చారన్నారు. కృష్ణయ్య ద్వారా బీసీలకు మంచి జరుగుతుందని వైఎస్‌ జగన్‌ భావించారన్నారు. కానీ కృష్ణయ్య రాజ్యసభ ఎంపీకి ఇప్పుడు రాజీనామా చేశారన్నారు. బీసీలకు అన్యాయం చేసిన వ్యక్తి సీఎం చంద్రబాబు అని విమర్శించారు. అలాంటి సీఎం చంద్రబాబు బేరసారాలకు కృష్ణయ్య తలొగ్గడం బాధాకరమన్నారు. బీసీలను కృష్ణయ్య మోసం చేశారని మండిపడ్డారు. ఆర్‌ కృష్ణయ్య చేసి ఈ ద్రోహానికి తెలుగు రాష్ట్రాల ప్రజలు క్షమించరని అన్నారు. సీఎం చంద్రబాబుకు అమ్ముడుపోయిన కృష్ణయ్య చరిత్ర హీనుడిగా మిలిపోవడం ఖాయమని కారుమూరి అన్నారు.
వైఎస్‌ జగన్‌కు ఉన్న ప్రజా ఆదరణ చూసి సీఎం చంద్రబాబు ఓర్వలేక పోతున్నారని అన్నారు. అందుకే తిరుపతి లడ్డు పేరుతో తప్పుడు ప్రచారానికి దిగారని విమర్శించారు. లడ్డుపై టీటీడీ ఈవో, ఒక మాట చంద్రబాబు మరో మాట మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. టీటీడీ ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారని, సూపర్‌ సిక్స్‌ నుంచి ప్రజల దృష్టిని మార్చడం కోసమే ఇదంతా చేశారని విమర్శించారు. సీబీఐ అంటే సీఎం చంద్రబాబు ఎందుకంత భయపడుతున్నారని ప్రశ్నించారు. లడ్డు వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించొచ్చు కదా అని కారుమూరి ప్రశ్నించారు.
Read More
Next Story