సీనియర్‌ న్యాయవాది గుళ్ళ పల్లి జ్యోత్స్న మృతికి సీఎం చంద్రబాబు సంతాపం
x

సీనియర్‌ న్యాయవాది గుళ్ళ పల్లి జ్యోత్స్న మృతికి సీఎం చంద్రబాబు సంతాపం

విజయవాడ బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు రాజస్థాన్‌ టూర్‌లో ఉండగా ప్రమాదం చోటు చేసుకుంది.


సీనియర్‌ న్యాయవాది, ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్రప్రసాద్‌ సతీమణి గుళ్ళ పల్లి జ్యోత్స్న మృతికి సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. విజయవాడ బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు స్టడీ టూర్‌ కోసం రాజస్థాన్‌ వెళ్లారు. మంగళవారం తెల్లవారు జామున వారు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో గుళ్ళ పల్లి జ్యోత్స్న మృతి చెందగా, మరో 11 మంది గాయాల పాలయ్యారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై రాజస్థాన్‌ ముఖ్యమంత్రి భజన్‌ లాల్‌ శర్మతో సీఎం చంద్రబాబు ఫోన్‌ లో మాట్లాడారు. బాధితులకు అవసరమైన సాయం అందిచాలని కోరారు. అడ్వకేట్లు తిరిగి ఇంటికి రావడానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ ఘటనపై విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ కూడా దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. జ్యోత్స్న మృతి పట్ల సంతాపం తెలిపారు.


Read More
Next Story