ఏపీ డీజీపీ కూతురు పెళ్లికి హాజరైన సీఎం చంద్రబాబు
x

ఏపీ డీజీపీ కూతురు పెళ్లికి హాజరైన సీఎం చంద్రబాబు

హైదరాబాద్‌లో జరిగిన ఈ వివాహానికి పలువురు మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు హాజరయ్యారు.


ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ ద్వారకా తిరుమల రావు కుమార్తె వివాహానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ కుమార్తెకు ఆశిస్సులు అందించిన సీఎం చంద్రబాబు, నూతన వధూవరులు గాయత్రి సోనాక్షి, రుత్విక్‌ సాయిలకు హ్యాపీ మ్యారీడ్‌ లైఫ్‌ అంటూ ఆశీర్వదించారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు కుమార్తె గాయత్రి వివాహం హైదరబాద్‌లోని సిటాడెల్‌ కన్వెన్షన్‌లో శనివారం రాత్రి జరిగింది. ఘనంగా జరిగిన ఈ వివాహ వేడుకకు ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్, ఏపీకి చెందిన పలువురు మంత్రులు, అధికారులు హాజరయ్యారు.

హోం మంత్రి వంగలపూడి అనిత, విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ పులురు ముఖ్య కార్యదర్శులు, ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఈ వివాహానికి హాజరయ్యారు.


Read More
Next Story