ఏప్రిల్‌ 23న పదో తరగతి పరీక్షల ఫలితాలు
x

ఏప్రిల్‌ 23న పదో తరగతి పరీక్షల ఫలితాలు

ఇంటర్‌ రిజల్ట్స్‌ లాగే వీటిని కూడా వాట్సాప్‌ ద్వారా తెలుసుకోవచ్చు.


ఇటీవల ఇంటర్‌ ఫలితాలను విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్‌ కూటమి ప్రభుత్వం బుధవారం టెన్త్‌ పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఆ మేరకు ఏర్పాట్లన్నీ ఇప్పటికే కొలిక్కి వచ్చాయి. ఏప్రిల్‌ 23 బుధవారం ఉదయం 11 గంటలకు పదో తరగతి ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కేవీ కేవీ శ్రీనివాసులు, పాఠ్యశాల విద్యా శాఖ డైరెక్టర్‌ విజయ్‌రామరాజు తెలిపారు. పదో తరగతి పరీక్షలతో పాటుగా ఓపెన్‌ స్కూల్‌ పదో తరగతి ఫలితాలను కూడా ఒకే సారి విడుదల చేయనున్నట్లు వారు వెల్లడించారు.

అభ్యర్థులు https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.inవెబ్‌సైట్ల ద్వారా కానీ, మన మిత్ర వాట్సప్‌ ద్వారా కానీ తెలుసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులు తమ స్మార్ట్‌ ఫోన్‌లోని వాట్సాప్‌లో 9552300009 నంబర్‌కు మెస్సేజ్‌ చేయడం ద్వారా కూడా తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. హాయ్‌ అని వాట్సాప్‌ ద్వారా మెస్సేజ్‌ పంపి ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్, ఎస్‌ఎస్‌సీ పబ్లిక్‌ పరీక్షల రిజల్ట్స్‌ ఆప్షన్లు ఎంచుకోవడంతో పాటుగా రోల్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయడం ద్వారా ఈజీగా పదో తరగతి ఫలితాలను పొందొచ్చు. రిజల్ట్స్‌ కాపీని కూడా పొందచ్చు అని వారు తెలియజేశారు. అంతేకాకుండా సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కూడా తమ పాఠశాల లాగిన్‌ల ద్వారా కూడా ఫలితాలకు సంబంధించిన ఫలితాల కాపీని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. లీప్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా ఉపాధ్యాయులు, విద్యార్థుల లాగిన్‌ ద్వారా కూడా ఫలితాలు పొందే సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సారి దాదాపు 6లక్షల మందికిపైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు.

Read More
Next Story