
కస్టడీకి ఆంజనేయలు ఐపీఎస్
మూడు రోజుల పాటు సీఐడీ అధికారులు ఆంజనేయులును విచారించనున్నారు.
విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును సీఐటీ అధికారులు ఆదివారం కస్టడీకి తీసుకున్నారు. కస్టడీకి తీసుకునే ముందుకు ఆంజనేయులు కాస్త అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన విజవాయడ జీజీహెచ్కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆంజనేయులును సీఐడీ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు సీఐడీ అధికారులు ఆంజనేయులును విచారించనున్నారు.
డీజీపీ ర్యాంకులో ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులును ముంబాయి సినీ నటి కాదంబరీ జెత్వానీ వేధింపుల కేసులో పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్లో అరెస్టు చేసి విజయవాడకు తీసుకొచ్చారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను విజయవాడ కోర్టు ముందు హాజరు పరిచారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు ఆంజనేయులుకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.
పీఎస్ఆర్ ఆంజనేయులును విచారించాల్సిన అవసరం ఉంది, కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉంది, ఈ నేపథ్యంలో వారం రోజుల పాటు కస్టడీకి తీసుకునేందుకు అనుమతులు ఇవ్వాలని సీఐడీ పోలీసులు కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపైన విచారణ చేపట్టిన కోర్టు వారం రోజులకు బదులుగా మూడు రోజులు కస్టడీకి తీసుకునేందుకు అనుమతులు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం, సోమవారం, మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించేందుకు అనుమతులిచ్చింది. అయితే న్యాయవాదుల సమక్షంలో పీఎస్ఆర్ ఆంజనేయులను విచారించాల్సి ఉంటుందని సీఐడీ అధికారులను కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో పీఎస్ఆర్ ఆంజనేయులును సీఐడీ అధికారులు మూడు రోజుల పాటు విచారించేందుకు కస్టడీకి తీసుకున్నారు.
Next Story