ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి చిరంజీవి కోటి విరాళం
x

ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి చిరంజీవి కోటి విరాళం

మెగాస్టార్‌ చిరంజీవి ఏపీ వరద బాధితుల సహాయార్థం కోటి రూపాయల చెక్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అందించారు.


మెగాస్టార్‌ చిరంజీవి వరద సాయం కింద కోటి రూపాయలను విరాళంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి అందజేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో సంభవించిన వరదలకు లక్షలాది మంది బాధితులయ్యారు. ఈ నేపథ్యంలో వరద బాధితుల సహాయార్థం కోటి రూపాయలను విరాళంగా ఇవ్వనున్నట్లు ఇది వరకు చిరంజీవి ప్రకటించారు. చిరంజీవి తన తరఫున రూ. 50లక్షలు, తన కుమారుడు రామ్‌ చరణ్‌ తరఫున మరో రూ. 50లక్షలు కలిపి మొత్తం కోటి రూపాయలను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. ఆ మేరకు చెక్కును శనివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అందజేశారు. సీఎం చంద్రబాబును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో చిరంజీవి కలిశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు చెక్‌ను అందించారు. విపత్కర పరిస్థితుల్లో స్పందించి సాయం అందించినందుకు సీఎం చంద్రబాబు చిరంజీవిని అభినందించారు. సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే చిరంజీవి వరద సాయం కింద కోటి రూపాయలు అందించడంపై సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. విరాళం చెక్కును అందించేందుకు హైదరాబాద్‌లోని తన నివాసానికి వచ్చిన చిరంజీవికి సీఎం చంద్రబాబు సాదర స్వాగతం పలికారు. భేటీ తర్వాత తిరిగి కారు వరకు వెళ్లి చిరంజీవికి వీడ్కోలు పలికారు.


Read More
Next Story