
చీఫ్ కార్డియాక్ సర్జన్ ఓపీ యాదవకు ఎన్టీఆర్ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్
సెప్టెంబర్ 9న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ స్నాతకోత్సవం నిర్వహించనున్నట్లు వీసీ చంద్రశేఖర్, రిజిస్ట్రార్ రాధికారెడ్డిలు వెల్లడించారు.
సెప్టెంబర్ 9న డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 27వ, 28 వ స్నాతకోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆ విశ్వవిద్యాలయ వీసీ డాక్టర్ పీ చంద్రశేఖర్, రిజిస్ట్రార్ రాధికారెడ్డి తెలిపారు. శనివారం డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో ఇతర అధికారులతో కలిసి వారు మాట్లాడారు. కోవిడ్ వల్ల 2021, 2022 బ్యాచ్లకు స్నాతకోత్సవం నిర్వహించలేదన్నారు. సెప్టెంబర్ 9 వ తేదీ న తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళా క్షేత్రంలో స్నాతకోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్, విశ్వ విద్యాలయ కులపతి జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ అధ్యక్షతన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యూనివర్శిటీ ప్రధానం చేసే గౌరవ డాక్టరేట్ కోసం ముగ్గురు పేర్లతో గవర్నర్ కు పంపించగా డిల్లీలోని నేషనల్ హార్ట్ ఇనిస్టిట్యూట్ కు చెందిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ – చీఫ్ కార్డియాక్ సర్జన్ డా. ఓపీ యాదవ కు గౌరవ డాక్టరేట్ డిగ్రీ కి ఎంపిక చేసినట్లు చెప్పారు.