
హనీమూన్ వదలండి..మంత్రులకు చంద్రబాబు స్వీట్ వార్నింగ్
సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం కేబినెట్ సమావేశం జరిగింది.
ఇక హనీమూన్ కాలం వదిలి.. పాలనలో దూకుడు పెంచాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహచర మంత్రులకు నవ్వుతూనే స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన అజెండాలోని పలు అంశాలపై చర్చల అనంతరం రాజకీయ అంశాలపై ప్రస్తావనకు వచ్చాయి. అందులో భాగంగా మంత్రులు, వారి పనితీరు గురించి చర్చించారు. అధికారంలోకి వచ్చి, మంత్రులుగా బాధ్యతలు తీసుకొని చాలా కాలమైందని, ఏడాదిగా సబ్జెక్టు నేర్చుకుంటూ మెరుగ్గానే పని చేశారని, ఇక హనీమూన్ కాలం వదిలి పాలనలో దూకుడు పెంచాలని మంత్రులకు సీఎం సూచించారు. మహిళలపై అసభ్యకరంగా వ్యాఖ్యలు, కించపరిచే విధంగా మాట్లాడే వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వారి వ్యాఖ్యలను తిప్పి కొట్టాలని వైసీపీ నేతలను ఉద్దేశించి సీఎం మంత్రులకు సూచించారు. వైసీపీ తప్పుడు వార్తల ప్రచారం చేస్తోందని, అలాంటి వైసీపీ వారి కుట్రల పట్ల జాగ్రత్తంగా ఉంటూ కౌంటర్లు ఇవ్వాలని సూచించారు.