
చంద్రబాబు ఢిల్లీ టూర్..మోదీతో భేటీ
శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లి రాత్రికి అక్కడే బస చేసి శనివారం తిరిగి రానున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీ టూర్కు వెళ్లనున్నారు. కశ్మీర్ పహల్గాం ఉగ్ర దాడుల నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన, ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీనికి ఆంధ్రప్రదేశ్కు రావాలని ఆహ్వానించనున్నారు. వచ్చే నెల 2న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ప్రారంభోత్సవానికి రావాలని ప్రధాని నరేంద్ర మోదీని సీఎం చంద్రబాబు ఆహ్వానించనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణాలు, వాటి ప్రాముఖ్యతలను ఈ సందర్భంగా చంద్రబాబు పీఎం మోదీకి మరో సారి వివరించనున్నారు.
అయితే రాజధాని అమరావతి నిర్మాణం ప్రారంభోత్సవానికి మే 2న ప్రధాని మోదీ రాక ఇప్పటికే ఖరారు అయ్యింది. అయితే మంగళవారం కశ్మీర్ పహల్గాం ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో భారత దేశంలో వాతావరణం ఒక్క సారిగా మారి పోయింది. ఈ నేపథ్యంలో మోదీకి మరో సారి గుర్తు చేసి ఆహ్వానించేందుకు సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నట్లు తెలిసింది. చంద్రబాబు ఢిల్లీ పర్యటన సందర్భంగా శుక్రవారం రాత్రికి ఢిల్లీలోనే ఆయన బస చేయనున్నారు. తిరిగి శనివారం ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడ నుంచి శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు.
Next Story