
టీడీపీ అధ్యక్షులుగా చంద్రబాబు ఏకగ్రీవం
నారా చంద్రబాబు చేత వర్ల రామయ్య ప్రమాణం చేయించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో సారి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులయ్యారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు అంతా కలిసి నారా చంద్రబాబును మరో సారి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, గత మూడు దశాబ్దాలుగా చంద్రబాబు టీడీపీ అధ్యక్షులుగా ఉన్నారు, ఎన్టీఆర్ ఎపిసోడ్ తర్వాత తొలిసారి ఆయన 1995లో టీడీపీ అధ్యక్ష పదవి చేపట్టారు. నాటి నుంచి నేటి వరకు చంద్రబాబు ఏకగ్రీవంగా టీడీపీ అధ్యక్షులుగా కొనసాగుతూనే ఉన్నారు. టీడీపీ అధ్యక్షులను ప్రతి రెండేళ్లకు ఒక సారి ఆ పార్టీ శ్రేణులు ఎన్నుకుంటాయి,
ఈ నేపథ్యంలో ప్రస్తుతం కడపలో జరుగుతున్న మహానాడులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబును మరో సారి టీడీపీ జాతీయ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు 25 మహానాడులను టీడీపీ నిర్వహించింది. నారా చంద్రబాబు 12వ సారి టీడీపీ అధ్యక్షులుగా మçహానాడు ఎన్నుకుంది. ఈ ఎన్నికల అధికారిగా టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య వ్యవహరించారు. టీడీపీ జాతీయ అధ్యక్షులుగా ఏకగ్రీవం అయిన తర్వాత చంద్రబాబు చేత వర్ల రామయ్య ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా చంద్రబాబు వర్ల రామయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.