
చంద్రబాబు నేడు నెల్లూరు పర్యటన
ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సారి నెల్లూరు జిల్లాను ఎంపిక చేసుకున్నారు. గురువారం ఆయన నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోని నెల్లూరు పాలెంలో ఆయన పెన్షన్ల పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఆయన శ్రీకారం చుట్టనున్నారు. గురువారం మేడే సందర్భంగా కార్మికులతో కూడా చంద్రబాబు ముచ్చటించనున్నారు.
గురువారం ఉదయం 10:30 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలిక్యాప్టర్లో సీఎం చంద్రబాబు బయలుదేరుతారు. 11:30కి నెల్లూరు జిల్లా ఆత్మకూరు బాలికల గురుకుల పాఠశాలకు చేరుకుంటారు. 11:30 నుంచి 11:40 వరకు అక్కడ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తారు. 11:40 అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 11:50కి ఆత్మకూరు అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోని నెల్లూరు పాలెంకు చేరుకుంటారు. 11:50 నుంచి 12:05 వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ను అందజేస్తారు.
12:05కి అక్కడ నుంచి బయలుదేరి రోడ్డు మార్గం గుండా వెళ్లి అదే ప్రాంతంలోని ఆంధ్ర ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో భవన నిర్మాణ కార్మికులతో సీఎం చంద్రబాబు ముచ్చటిస్తారు. అక్కడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12:35 గంటలకు జాతీయ రహదారి–67కి పక్కనే ఉన్న నారంపేటలోని ఎంఎస్ఎంఈ పార్కును ప్రత్యక్షంగా ప్రారంభిస్తారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని మరో 50 ఎంఎస్ఎంఈ పార్కులను వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1:30 గంటల నుంచి 3:0 గంటల వరకు అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదికలో స్థానిక ప్రజలతో ముచ్చటిస్తారు. అక్కడ నుంచి ఆత్మకూరులోని టిడ్కో గ్రౌండ్కు చేరుకుంటారు. 3:05 గంటల నుంచి 4:05 వరకు గంట పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం అవుతారు. 4:40కి బాలికల గురుకుల పాఠశాలలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. 4:45 అక్కడ నుంచి బయలుదేరి 5:45 గంటలకు ఉండవల్లిలోని తన నివాసానికి సీఎం చంద్రబాబు చేరుకుంటారు.
Next Story