
పొదిలిలో గలాటా చేయించింది చంద్రబాబే
రైతుల సమస్యలను పట్టించుకోకుండా, తిరిగి వారిపైనే ఎదురు కేసులు పెట్టడం మీకు మాత్రమే చెల్లుతుంది..అంటూ సీఎం చంద్రబాబుపై జగన్ మండిపడ్డారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో సారి ధ్వజమెత్తారు. ప్రజలు, రైతులు సమస్యలను వెలుగులోకి రానీకుండా.. వాటి మీద గొంతెత్తనీకుండా డైవర్ట్ పాలిటిక్స్కు పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. పొగాకు రైతుల కష్టాలు తెలుసుకునేందుకు, వారికి భరోసా ఇచ్చేందుకు తాను పొదిలికి వెళ్తే అక్కడ టీడీపీ శ్రేణులను ఉసిగొల్పి, వారితో ప్రజలుపైన, రైతులపైన దాడులు చేయించింది మీరు కాదా? అంటూ చంద్రబాబును ప్రశ్నించారు. మీరే మీవాళ్లతో దాడులు చేయించడమే కాకుండా మళ్లీ ప్రజలు, రైతులపైనే కేసులు పెడుతున్నారంటే ఎంత దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారో అర్థం అవుతుందని సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. ఆ మేరకు శనివారం సోషల్ మీడియా వేదికగా జగన్ స్పందించారు.
.@ncbn గారూ పొగాకు పంటకు కనీస మద్దతు ధరలు లభించక రైతులు అన్యాయానికి గురవుతుంటే, వారిని పరామర్శించి భరోసా ఇవ్వడానికి ప్రకాశం జిల్లా పొదిలి నేను వెళ్తే, ఆ కార్యక్రమాన్ని డైవర్ట్ చేయడానికి మీరు కుట్ర చేయడం భావ్యమా? రైతులను పరామర్శించే ఈ కార్యక్రమానికి సంఘీభావంగా దాదాపు 40 వేలమంది…
— YS Jagan Mohan Reddy (@ysjagan) June 14, 2025