
మాట్లాడుతూ పడిపోయిన బొత్స
వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
మాజీ మంత్రి, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఎల్వోపీ, సీనియర్ వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెన్నుపోటు దినం కార్యక్రమంలో మాట్లాతూ.. మాట్లాడుతూ ఒక్క సారిగా కింద పడిపోయారు. దీంతో పక్కన ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు షాక్కు గురయ్యారు. వెంటనే తేరుకుని పడిపోయిన బొత్స సత్యనారాయణను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
జూన్ 4న వెన్నుపోటు దినంగా పేర్కొంటూ బుధవారం నాడు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ర్యాలీలు, ఆందోళనల వంటి కార్యక్రమాలను చేపట్టాలని వైఎస్ఆర్కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ఆ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఆ మేరకు బుధవారం విజయనగరం జిల్లా చీపురుపల్లిలో వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ నేతృత్వంలో వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహించారు.
అంజనేయపురం నుంచి స్థానిక మూడు రోడ్ల కూడలి వరకు ర్యాలీలు కూడా నిర్వహించారు. అనంతరం నిర్వహించిన నిరనసన సభ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం తాలూకు వైఫల్యాల మీద మైక్లో మాట్లాడుతూ.. మాట్లాడుతూ ఒక్క సారిగా కుప్పకూలిపోయారు. మైక్లో మాట్లాతున్న సమయంలోనే ఆయన అస్వస్థతకు గురయ్యారు. వడదెబ్బ తగలడంతో ఒక్క సారిగా కింద పడిపోయారు. వెంటనే తేరుకున్న వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణను విశాఖపట్నం ఆసుపత్రికి తరలించారు.
Next Story