విజయవాడ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపులు
x

విజయవాడ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపులు

రెండు సార్లు బాంబు బెదిరింపు కాల్స్‌ రావడంతో విజయవాడ ఒక్క సారిగా ఉలిక్కి పడింది.


ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ రైల్వేస్టేషన్‌ అయిన విజయవాడ రైల్వేస్టేషన్‌కు బాంబు బెరింపులు వచ్చాయి. విజయవాడ రైల్వేస్టేషన్‌లో బాంబులు పెట్టాము, త్వరలో పేలుతాయని ఆగంతకులు ఫోన్‌ చేయడంతో రైల్వే అధికారులు ఒక్క సారిగా ఉలక్కి పడ్డారు. ఫోన్‌ కాల్‌తో అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగారు. రైల్వేస్టేషన్‌లోని ప్రతి అణువును తనిఖీలు చేపట్టారు. క్షుణ్ణంగా పరిశీలించారు. బాంబు స్క్వాడ్‌తో స్టేషన్‌ అంతా గాలింపులు చేపట్టారు.

స్టేషన్‌లోని 10 ప్లాఫామ్‌లలోను, షాపుల్లోను, ప్రయాణికుల బ్యాగులను, అనుమానాస్పద ప్రదేశాలలోను విస్తృత స్థాయిలో జల్లెడ పట్టారు. అయితే ఎక్కడా కూడా బాంబులకు సంబందించిన ఆనవాళ్లు కానీ, పేలుడుకు సంబంధించిన పదార్థాలు కానీ ట్రేస్‌అవుట్‌ కాలేదు. దీంతో రైల్వే అధికారులు, పోలీసులు, సిబ్బంది, ప్రయాణికులు, వ్యాపారస్తులు, అంతా ఊపిరి పీల్చుకున్నారు. చివరకు ఫోన్‌ కాల్‌ మీద దృష్టి పెట్టారు. సాంకేతిక సహకారంతో çపరిశీలించిన సిబ్బంది అది ఒట్టి ఫేక్‌ కాల్‌గా నిర్థారించారు.

అంతకంటే ముందు బీసెంట్‌ రోడ్డులో బాంబులు పెట్టినట్లు నేరుగా పోలీసులకు ఫోన్‌ చేశారు. బీసెంట్‌ రోడ్డులో బాంబులు పెట్టామని, త్వరలోనే అవి పేలొచ్చని చెప్పి తర్వాత ఫోన్‌ కట్‌ చేశారు. దీంతో విజయవాడ పోలీసులు ఒక్క సారిగా ఉలిక్కి పడింది. పోలీసులు రంగంలోకి దిగారు. డాగ్‌ స్క్వాడ్‌లను రంగంలోని దింపారు. నాలుగు బృందాలుగా పోలీసులు గాలింపులకు దిగారు. ఈ నేపథ్యంలో బీసెంట్‌ రోడ్డులోని వ్యాపారస్తులు, స్థానికులు, ప్రజలు తీవ్ర ఆందోళనలకు గురయ్యారు.
అయితే అటు విజయవాడ రైల్వే స్టేషన్‌ బాంబు బెదిరింపు కాల్స్‌ చేసిన వాళ్లు, ఇటు బీసెంట్‌ రోడ్డు బాంబు బెదింపు కాల్స్‌ చేసిన వాళ్లు ఒకటేనా? లేక వేరేనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రెండు ఫోన్‌ కాల్స్‌ ఒకే రోజు రావడంతో విజయవాడ ఒక్క సారిగా షాక్‌కు లోనైంది, నగర వాసులు, వ్యాపారస్తులు, పోలీసులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
Read More
Next Story