సెక్స్  రాకెట్ లో టార్గెట్ భార్గవ్... దొరికింది శంకర్
x

సెక్స్ రాకెట్ లో టార్గెట్ భార్గవ్... దొరికింది శంకర్

విజయవాడ నగరంలో సెక్స్ రాకెట్ స్పా మాటున జరుగుతోంది. దేశ, విదేశాల అమ్మాయిలు ఇక్కడ అందుబాటులో ఉంటారు.


తానొకటి తలిస్తే దైవమొకటి తలిసిందంటారు పెద్దలు. సరదాగా అమ్మాయిలతో మసాజ్ చేయించుకుని ఎంజాయ్ చేద్దామని వెళ్లాడో రాజకీయ నాయకుడు శంకర్. డబ్బును ఇబ్బడి ముబ్బడిగా సంపాదించే పనిలో స్పా సెంటర్ పెట్టి అమ్మాయిలతో సుఖ వ్యాపారం చేయిస్తున్నాడు విజయవాడకు చెందిన భార్గవ్. ఎక్కడో థాయిలాండ్ వెళ్లి రూ. 50 వేలు ఖర్చు పెట్టుకుని రెండు రోజులు తిరిగి వచ్చే బదులు అంతకంటే సెక్స్ సుఖం విజయవాడలోని కొన్ని స్పా సెంటర్లలో అందుతోంది. పైగా యాభై వేలు ఉంటే నాలుగు రోజులు ఎంజాయ్ చేయవచ్చు. సమయం ఏదైనా పరవాలేదు. ఎప్పుడూ ఈ సెంటర్లు తెరిచే ఉంటున్నాయి. కావాల్సినంత సేపు ఉండొచ్చు. ఇదీ ప్రస్తుతం విజయవాడ నగరంలో జరుగుతున్న సెక్స్ వ్యాపారం. ఇంతకూ ఈ భార్గవ్ ఎవరు? శంకర్ ఎవరు?

స్పా సెంటర్ లో అన్నీ ఉంటాయి...

రాష్ట్ర విభజన తరువాత విజయవాడలో స్పా సెంటర్ల సంఖ్య పెరిగింది. సుమారు 250 వరకు స్పా సెంటర్లు ఉన్నాయి. అన్ని అనుమతులు తీసుకుని నిర్వహిస్తున్నారు. స్పా సెంటర్లలో కేవలం మసాజ్ మాత్రమే కాకుండా బ్యూటీషన్ ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఆడ, మగ ఎవరైనా స్పా సెంటర్ లోకి వెళితే కటింగ్, స్నానం, బ్యూటిఫికేషన్ చేసి అందంగా ముఖాన్ని తీర్చి దిద్ది బయటకు పంపుతారు. అందుకు అయ్యే ఖర్చు వేలల్లోనే ఉంటుంది. అయితే ఎంతో మంది డబ్బున్న వారి పిల్లలు ఉదయం ఇంట్లో స్నానం చేయడం మరిచిపోయారు. ఉదయం లేవగానే నేరుగా కొన్ని సౌకర్యాలు ఉన్న స్పా సెంటర్ లకు వెళుతున్నారు. అక్కడ మసాజ్, అవసరమైతే సెక్స్ కోరికలు తీర్చు కోవడం, కటింగ్ చేయించుకుని హెయిర్ డ్రై చేయించుకుని నీట్ గా తయారై బయటకు వస్తున్నారు. పెద్ద భవంతుల్లో ఒక ఫ్లోర్ అంతా ఈ స్పా సెంటర్ కు తీసుకుంటారు. కింద బంగారు షాపు ఉంటే పైన స్పా సెంటర్ ఉంటుంది. ఇలా ఎన్నో చోట్ల ఉన్నాయి. అద్దెలు కూడా లక్షల్లో చెల్లిస్తున్న స్పా సెంటర్ లు ఉన్నాయి.

దేశ, విదేశాల నుంచి అమ్మాయిలు

స్పా సెంటర్లలో మసాజ్ చేసేయడంతో పాటు కటింగ్ లు చేసేందుకు కూడా దేశ, విదేశాలకు చెందిన అమ్మాయిలు ఉంటున్నారు. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, రాజస్థాన్, ఒడిస్సా తో పాటు నేపాల్, థాయిలాండ్, సింగపూర్, మలేషియా దేశాల నుంచి వచ్చి అమ్మాయిలు విజయవాడలోని స్పా సెంటర్లలో పనిచేస్తున్నారు. వీరు మంచి ఆకర్షణీయమైన తెల్ల రంగులో ఉంటూ స్పాలకు వచ్చే వారిని ఆకర్షిస్తారు. అప్పటి కప్పుడు అమ్మాయి కావాల్సి వస్తే మసాజ్ నిర్వహించే రూముల్లోనే గంటల్లో పని కానిస్తారు. గంటకు వేలల్లో చార్జ్ చేస్తారు. ఇదంతా ఇక్కడ సాధారణమై పోయింది.

పదేళ్లుగా స్పా మాటున వ్యభిచారం

విజయవాడలో గత పది సంవత్సరాలుగా స్పా మాటున వ్యభిచారం నడుస్తూనే ఉంది. ప్రస్తుతం స్పా సెంటర్లలో పనిచేసే అమ్మాయిలు బ్యాచ్ లర్స్ ఉండే రూములకు కూడా వచ్చి వెళుతుంటారు. అపార్ట్ మెంట్స్ లో చాలా మంది ఉద్యోగులు, నిరుద్యోగులు ఫ్లాట్స్ తీసుకుని ఉంటున్నారు. అప్పుడప్పుడు వారి బంధువులు కూడా ఇంటికి వచ్చి వెళుతుంటారు. అమ్మాయి కావాలనుకునే వారు నేరుగా స్పా సెంటర్ కు వెళ్లి కావాల్సిన అమ్మాయిని సెలక్ట్ చేసుకుని కావాల్సిన సమయంలో ఫ్లాట్ కు పిలిపించుకుంటారు. బంధువుల మాదిరి ఇంటికి వచ్చి వంటలు వండి పెట్టి వారితో ఒక రోజంతా గడిపి వెళుతుంటారు. ఇది సర్వ సాధారణంగా మారింది. ఈ వ్యవహారాలు అపార్ట్ మెంట్స్ లో ఉంటున్న వాచ్ మెన్ లకు మాత్రం తెలుస్తాయని పోలీసులు అంటున్నారు.

భార్గవ్ కు వల వేసిన పోలీసులు

చలసాని ప్రసన్న భార్గవ్ విజయవాడలో ఒక స్పా నిర్వాహకుడు. స్టూడియో 9 పేరుతో ఈ స్పా సెంటర్ నిర్వహిస్తున్నాడు. గత ప్రభుత్వంలోనూ, ఈ ప్రభుత్వంలోనూ ఇతనికి ఎదురు లేకుండా పోయింది. గత ప్రభుత్వంలో హోం మంత్రి పీఏ ఒకరు స్పా సెంటర్ల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారం అప్పట్లో డీజీపీ వద్దకు వెళ్లింది. దీంతో అప్పటి హోం మంత్రి తానేటి వనిత ఆ పీఏ ను తొలగించారు. పోలీసులు స్పా సెంటర్ ల పై ప్రత్యేక దృష్టిపెట్టి కొన్ని నిబంధనలు అప్పుడు రూపొందించారు. సీసీ టీవీ పుటేజీ నెల రోజులు తప్పకుండా ఉంచాలని, స్పా సెంటర్లు ఎప్పుడూ డోర్స్ తెరిచే ఉంచాలని, మసాజ్ చేయించుకునే వారు వచ్చినప్పుడు మాత్రమే ఆ రూము మూసి తరువాత తెరిచి ఉంచాలని, ఎప్పుడు పోలీసులు తనిఖీకి వచ్చినా వారికి సహకరించాలని గత ప్రభుత్వంలో సీపీగా ఉన్న కాంతిరాణా తాతా నిబంధనలు విధించారు. ఆ నిబంధనలు నేటికీ అమలవుతున్నాయి. పోలీసులు స్పా సెంటర్ కు వెళ్లగానే భార్గవ్ తప్పించుకుని పరారయ్యాడు. ఈ స్పా సెంటర్ లో ఎప్పటి నుంచో సెక్స్ వ్యాపారం జోరుగా సాగుతోందనే ఫిర్యాదులు రావడంతో భార్గవ్ పై పోలీసులు వల విసిరారు. అయినా వలలో పడకుండా తప్పించుకున్నాడు భార్గవ్. ఏ ప్రభుత్వం వచ్చినా ఇతను ప్రభుత్వంలోని వారిని లోబరుచుకుని ఈ సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నాడని సమాచారం.

తెలుగుదేశం ప్రభుత్వం రాగానే...

తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గతంలో పోలీసుల దెబ్బకు కాస్త వెనకడుగు వేసిన చలసాని ప్రసన్న భార్గవ్ రెచ్చిపోవడం మొదలు పెట్టారు. తన స్పా సెంటర్ లో ఉన్న అమ్మాయిల ద్వారా జోరుగా సెక్స్ వ్యాపారం చేయిస్తున్నాడు. రోజుకు లక్షల్లో సంపాదిస్తున్నడు. దీంతో మిగిలిన కొందరు స్పా సెంటర్ ల యజమానులు ఇటీవల విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబును కలిసి భార్గవ్ చేస్తున్న సెక్స్ వ్యాపారంపై కంప్లైంట్ చేశారు. తామంతా స్పా సెంటర్ లు నిర్వహించుకుంటుంటే అతనొక్కడు స్పా సెంటర్ ను సెక్స్ సుఖం అందించే సెంటర్ గా మార్చాడని, ఎన్ని సార్లు పోలీసులకు చెబుతున్నా పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కొన్ని వివరాలు సేకరించి నేరుగా దాడి చేశారు. ఈ దాడిలో సెక్స్ సుఖం కోసం వచ్చిన 11 మంది విటులు పట్టుబడ్డారు. వీరితో పాటు అమ్మాయిలను కొందరిని అదుపులోకి తీసుకున్నారు.

వైఎస్సార్సీపీ నాయకుడు శంకర్ నాయక్ ఎలా దొరికాడంటే...

భార్గవ్ ను పట్టుకునేందుకు వల వేస్తే ఆ వలలో వైఎస్సార్సీపీ ఎస్టీ విభాగం నాయకుడు, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు వడిత్యా శంకర్ నాయక్ పడ్డాడు. పోలీసులు తనిఖీకి వెళ్లగానే మంచం కిందకు దూరటంతో పోలీసులు శంకర్ నాయక్ ను అదుపులోకి తీసుకున్నారు. మసాజ్ కోసం వచ్చి ఉంటే పోలీసులను చూసి భయపడి మంచం కిందకు దూరాల్సిన అవసరం ఏమొచ్చిందని అదుపులోకి తీసుకున్నారు. శంకర్ నాయక్ ఉన్న రూములోనే అమ్మాయి కూడా ఉంది. వారు ఇద్దరూ మంచంపై ఉండగా పోలీసులు చూడలేదు. శంకర్ నాయక్ ఉన్న రూములో అమ్మాయి కూడా ఉండటంతో సెక్స్ చేసేందుకే వచ్చాడని పోలీసులు చెబుతున్నారు. బట్టలు వేసుకున్నవి వేసుకున్నట్లు గానే ఉన్నాయి. బట్టలు విప్పి ఉంటే వేరుగా ఉండేదని పోలీసుల్లో ఒకరు వ్యాఖ్యానించారు. స్పా సెంటర్ లో అమ్మాయితో ఉన్నాడంటే గతంలో కూడా ఇక్కడికి వస్తూనే ఉండి ఉంటాడనే అనుమానం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. గిరిజన వర్గాలను అప్పుడప్పుడు తీసుకుని వచ్చి ధర్నాలు చేస్తుంటాడని, ఇటీవల నారాయణ కాలేజీలో ఒక గిరిజన విద్యార్థి చనిపోతే నానా యాగీ చేశాడని, అందువల్ల అవకాశం వచ్చింది కాబట్టి పోలీసులు వదిలే పరిస్థితి లేదని స్పష్టమైంది. విటురాలు రూములోనే ఉండగా పట్టుపడినందున కేసు నమోదు చేసేందుకు అన్ని ఆధారాలు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

భార్గవ్ కోసం వేట

భార్గవ్ కోసం పోలీసులు వేట ప్రారంభించారు. ఎక్కడెక్కడి నుంచి అమ్మాయిలను పిలిపిస్తున్నారు. వారికి నెలకు జీతం ఎంత ఇస్తాడు. ఒక వేళ విటుల వద్దకు వెళితే ఇతను ఎంత తీసుకుంటాడు. ఆ యువతులకు ఎంత ఇస్తాడు. ఎంత కాలం నుంచి ఇలా చేస్తున్నాడు. మసాజ్ చేసేందుకు వచ్చిన వారిలో ఎంత మంది అమ్మాయిలను సెక్స్ రాకెట్ లోకి దించాడు. ఎవరైనా ట్రాపికింగ్ కు గురైన వారు భార్గవ్ దగ్గర ఉన్నారా? ఈ స్పా సెంటర్ లోనే ఉన్నారా? ఇంకెక్కడైనా అమ్మాయిలను ఉంచుతున్నరా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికి స్పా మేనేజర్ దగ్గుబాటి శ్యామ్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సీసీటీవీ పుటేజీలు పరిశీలిస్తున్నారు. ఎవరెవరు ఈ ఆరు నెలల నుంచి వచ్చి వెళుతున్నారనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది.

వర్కింగ్ ఉమెన్స్ పేరుతో అపార్ట్ మెంట్స్ ఫ్లాట్స్ అద్దెలకు తీసుకుని..

చాలా అపార్ట్ మెంట్స్ లో వివిధ ఉద్యోగాలు చేస్తున్నామని ఏదో ఒక కంపెనీ ఐడీ కార్డుతో వర్కింగ్ ఉమెన్స్ గా కొందరు యువతులు అద్దెలకు దిగుతున్నారు. వారు పగలు కొందరు, రాత్రులు కొందరు బయటకు వెళుతుంటారు. రాత్రుల షిఫ్ట్ లు కూడా ఉంటున్నాయని అపార్ట్ మెంట్ కమిటీ వారిని నమ్మిస్తున్నారు. విదేశాల్లో ఉన్న వారికి సేవలు అందించే కంప్యూటర్ సెంటర్లు కొన్ని విజయవాడలో ఉన్నాయి. ఈ సెంటర్లు రాత్రులు కూడా పనిచేస్తాయి. కాలమానాల్లో తేడాలు ఉన్నందున ఆ దేశాల్లోని కాలమానం ప్రకారం ఇక్కడ ఉద్యోగులు పనిచేస్తారు. ఎక్కువ మంది విదేశీయులు తమకు కావాల్సిన లెటర్స్, ఇతర మెజేస్ లు, మెయిల్ ఉత్తరాలు వంటివి వాయిస్ మెసేజ్ లు ఈ సెంటర్లకు పంపిస్తారు. ఇక్కడి వారు ఆ వాయిస్ మెసేజ్ లను రాసి పంపించి డబ్బులు తీసుకుంటారు. ఈ బిజినెస్ జోరుగా సాగుతోంది. దీనిని అడ్డం పెట్టుకుని కొందరు అమ్మాయిలు రాత్రులు పిలిపించుకునే వారి ఇళ్లకు వెళ్లి రాత్రంతా ఉండి వస్తుంటారు. ఆ విధమైన వ్యాపారం కూడా విజయవాడలో ఎక్కువగానే సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

Read More
Next Story