విజయవాడ జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా ఏవీ రావు
x

విజయవాడ జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా ఏవీ రావు

గవర్నమెంట్‌ కళాశాలలు, బోధనా ఆసుపత్రుల మీద కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది.


ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖపై దృష్టి సారించింది. అందులో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రభుత్వ ఆసుపత్రులు, బోధనా ఆసుపత్రులలో నియామకాలకు శ్రీకారం చుట్టింది. గవర్నమెంట్‌ వైద్య కళాశాలలకు కొత్త ప్రిన్సిపిల్స్‌ను, నూతన సూపరింటెండెంట్‌లను నియామకాలు చేపట్టింది. ఆ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీటికి గ్రీన్‌ సీగ్నల్‌ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ వైద్య కళాశాల అయిన ఆంధ్ర మెడికల్‌ కళాశాలకు నూత ప్రిన్సిపల్‌గా డాక్టర్‌ సంధ్యాదేవిని కూటమి ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలో పేరు పొందిన మరో మెడికల్‌ కళాశాల అయిన కాకినాడ రంగరాయ మెడికల్‌ కళశాలకు కూడా కొత్త ప్రిన్సిపల్‌ను నియమించింది. డాక్టర్‌ విష్ణువర్థన్‌ను కాకినాడ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌గా నియమించారు. దీంతో పాటుగా నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి గవర్నమెంట్‌ మెడికల్‌ కళాశాల(ఏసీఎస్‌ఆర్‌జీఎంసీ)కు డాక్టర్‌ రాజేశ్వరిని ప్రిన్సిపల్‌గా నియమించారు.
రాష్ట్రంలోని పలు ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రులకు కొత్త సూపరింటెండెంట్‌లను నియమించారు. ఒంగోలు గవర్నమెంట్‌ జనలర్‌ ఆసుపత్రికి డాక్టర్‌ సుబ్రహ్మణ్యంను నూతన సూపరింటెండెంట్‌గా నియమించారు. శ్రీకాకుళం ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి డాక్టర్‌ అమూల్యను సూపరింటెండెంట్‌గా నియమించారు. తిరుపతి జీజీహెచ్‌కు డాక్టర్‌ రాధను, మచిలీపట్నం ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి డాక్టర్‌ వి మన్మథరావును సూపరింటెండెంట్‌లుగా నియమించారు. రాష్ట్రంలోనే పేరుగాంచిన రాజధాని ప్రాంతమైన విజయవాడ గవర్నమెంట్‌ జనరల్‌ ఆసుపత్రికి డాక్టర్‌ ఏవీ రావును సూపరింటెండెంట్‌గా నియమించింది. ఇప్పటి వరకు ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా ఆయకే పూర్తి స్థాయి సూపరింటెండెంట్‌ బాధ్యతలను అప్పగించారు.
వీటితో పాటుగా ప్రొఫెసర్‌ హోదాలో సేవలు అందిస్తున్న మరో ఎనిమిది మంది డాక్టర్లకు మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ హోదాలను కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కూటమి భాగస్వామి అయిన బీజేపీకి చెందిన ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్‌ యాదవ్‌ ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. 2014–19లో కూడా నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు బీజేపీ అభ్యర్థిగా కైకలూరు నుంచి గెలిచిన కామినేని శ్రీనివాస్‌కు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి పదవిని అప్పగించారు. రెండు దఫాలు బీజేపీకి చెందిన నాయకులకే కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి బాధ్యతలను అప్పగించడం గమనార్హం.
Read More
Next Story