సీబీఎన్‌ ఉన్నంత వరకు నేరస్తులకు చోటు లేదు
x

సీబీఎన్‌ ఉన్నంత వరకు నేరస్తులకు చోటు లేదు

గుంటూరు ఏఐ హ్యాకథాన్‌లో ఐటీ, ఏఐ నిపుణులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు.


సీబీఎన్‌(నారా చంద్రబాబు నాయుడు) ఉన్నంత వరకు నేరస్థులకు చోటు లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. శాంతిభద్రతలు మంచిగా ఉన్న చోటే డెవలప్‌మెంట్‌ అనేది జరుగుతుందన్నారు. నాటి ఉమ్మడి రాష్ట్రంలో రౌడీయిజాన్ని, నక్సలిజాన్ని, స్మగ్లర్లను పూర్తి స్థాయిలో కట్టడి చేశామని తెలిపారు. శుక్రవారం గుంటూరు ఆర్వీఆర్‌ జేసీ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలీసు ఏఐ హ్యాకథాన్‌ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంఆ పలువురు ఐటీ, ఏఐ నిపుణులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు.

అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ నాడు తాను ఉమ్మడి రాష్ట్రంలో పూర్తి స్థాయిలో లా అండ్‌ ఆర్డర్‌ను కంట్రోల్‌ చేశామన్నారు. ఐటీ వల్లే దేశంలోనే అధిక తలసరి ఆదాయం గల రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందని అన్నారు. అంతేకాకుండా మోస్ట్‌ లివబుల్‌ సిటీగా హైదరాబాద్‌ మహానగరం కూడా రూపుదిద్దుకుందని వెల్లడించారు. దీనికి కారణం నాడు ఉమ్మడి రాష్ట్రంలోను, హైదరాబాద్‌ సిటీలోను శాంతిభద్రతలను పూర్తి స్థాయిలో పరిరక్షించడమే కారణమన్నారు. లా ఆండ్‌ ఆర్డర్‌ సరిగా లేక పోతే అభివృద్ధి అనేది సాధ్యం కాదన్నారు. సంఘవిద్రోహ శక్తులను కట్టడి చేయడంలో సాంకేతిక పరిజ్ఞానం సహకారం తీసుకున్నామన్నారు. ఇదే మాదిరిగా నేడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా చేయాలని చూస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో క్వాంటం వ్యాలీ కింద ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)కి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం ప్రపంచాన్ని ఏలుతున్న ఏఐలో తెలుగు వారి సత్తా ప్రపంచానికి చాటాలన్నారు. ఏఐ వస్తే ఉద్యోగాలు పోయానేది కేవలం అపోహ మాత్రమే అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 15 నుంచి వాట్సప్‌ గవర్నెన్స్‌ ద్వారా ఇంటి నుంచే అన్ని రకాల ధృవపత్రాలు పొందొచ్చన్నారు. కాలానుగుణంగా ఎప్పటికప్పుడు టెక్నాలజీని ఉపయోగించుకుంటూ డెవలప్‌మెంట్‌ సాధించాలన్నారు. భవిష్యత్‌లో హార్డ్‌ వర్క్‌ ఉండదని, కేవలం స్మార్ట్‌ వర్కే ఉంటుందన్నారు. స్మార్ట్‌ వర్క్‌తోనే ప్రపంచాన్ని జయించొచ్చని, అందులో భాగంగా దేశంలోనే మొదటిగా ఏపీలో డ్రోన్, స్సేస్‌ సిటీలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఇంటిని జియో ట్యాగ్‌ చేస్తున్నామని, ఏదైన ప్రకృతి వైపరిత్యాలు చోటు చేసుకుంటే డ్రోన్స్‌ ద్వారా బాధితులకు సహాయం అందిస్తామన్నారు. ఏఐ సాయంతో విశ్లేషించి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తెలుగువారి సత్తా చాటే సమయం వచ్చిందని, థింక్‌ గ్లోబల్లీ.. యాక్ట్‌ లోకల్లీ అనే నినాదాన్ని అందిపుచ్చుకుని అడుగులు వేయాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని, టెక్నాలజీ సహకారంతో నేరాలను పూర్తి స్థాయిలో అదుచేశామన్నారు. వైసీపీ వంటి హంతకులు రాజకీయాలకు అర్హులు కాదన్నారు. రౌడీల పక్కన నిలబడాలంటే ఒకప్పుడు రాజకీయ నాయకులు సిగ్గుపడే వారని, కానీ ఇప్పుడు రౌడీలే రాజకీయ నాయకులుగా రూపం మార్చుకున్నారని వైసీపీ నాయకులను ఎద్దేవా చేశారు.
Read More
Next Story