ఏపీకి ఐఎండీ వార్నింగ్.. పలు జిల్లాల్లో వర్షాలు
x

ఏపీకి ఐఎండీ వార్నింగ్.. పలు జిల్లాల్లో వర్షాలు

ఐఎండీ సూచనల ప్రకారం రానున్న రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.


ఐఎండీ సూచనల ప్రకారం రానున్న రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. ఐఎండీ రిపోర్ట్స్ ప్రకారం రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఆవర్తనం కొనసాగుతుందని తెలిపారు. ఈ ఆ వర్తనం నుంచి కమోరిన్ ప్రాంతం వరకు ద్రోణి విస్తరించి ఉన్నందని, దీని కారణంగా రానున్న రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వివరించారు.

ద్రోణి ప్రభావంతో మంగళవారం అంటే ఆగస్టు 20వ తేదీన.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, అనంతపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే విశాఖపట్నం, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

బుధవారం కూడా ఇవే పరిస్థితులు కొనసాగనున్నాయని, 21వ తేదీన పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, ఏలూరు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, , శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.

వర్షాలు కురుస్తున్న క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూర్మనాథ్ సూచించారు. ఆకస్మికంగా మారుతున్న వాతావరణం కారణంగా పలు రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని, కాబట్టి ప్రజలు ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అంతేకాకుండా వర్షం కురిసే సమయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.

Read More
Next Story