
ఏఐ శిక్షణ కోసం ఎన్వీడియాతో ఏపీ ఒప్పందం
మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఎంవోయు కుదుర్చుకున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ను ఏఐ హబ్గా తయారు చేస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులేస్తోంది. ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు చేసుకునే పనిలో నిమగ్నమైంది. అందులో భాగంగా శనివారం అమెరికాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్ సంస్థతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. అమెరికాకు చెందిన ప్రముఖ ఎన్వీడియాతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఏఐని డెవలప్ చేయడమే కాకుండా వేలాది మంది విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహించేందుకు రెడీ అయ్యారు.
Andhra Pradesh is welcoming bold initiatives to lead India’s AI revolution. Under the leadership of Hon'ble IT Minister Shri @naralokesh Garu, we have entered into an MoU with @nvidia to build a strong and inclusive AI ecosystem in the state.
— N Chandrababu Naidu (@ncbn) June 7, 2025
With support from NVIDIA for… pic.twitter.com/T7G3lEvMn8