ఏఐ శిక్షణ కోసం ఎన్వీడియాతో ఏపీ ఒప్పందం
x

ఏఐ శిక్షణ కోసం ఎన్వీడియాతో ఏపీ ఒప్పందం

మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ఎంవోయు కుదుర్చుకున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు.


ఆంధ్రప్రదేశ్‌ను ఏఐ హబ్‌గా తయారు చేస్తామని చెప్పిన సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులేస్తోంది. ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు చేసుకునే పనిలో నిమగ్నమైంది. అందులో భాగంగా శనివారం అమెరికాకు చెందిన ప్రముఖ మల్టీనేషనల్‌ సంస్థతో అగ్రిమెంట్‌ కుదుర్చుకుంది. అమెరికాకు చెందిన ప్రముఖ ఎన్వీడియాతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అగ్రిమెంట్‌ కుదుర్చుకుంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఏఐని డెవలప్‌ చేయడమే కాకుండా వేలాది మంది విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహించేందుకు రెడీ అయ్యారు.

దీని మీద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌ను ఏఐ రంగంలో ప్రపంచ కేంద్రంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీని కోసం బలమైన ఏఐ వ్యవస్థను ఏపీలో ఏర్పాటు చేయనున్నామన్నారు. అందులో భాగంగా ఏఐ శిక్షణ కోసం ఎన్వీడియోతో ఏపీ ఒప్పందం కుదుర్చుకుందన్నారు, మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ఎంవోయు కుదుర్చుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఏఐ శిక్షణలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే రెండేళ్ల కాలంలో ఈ సంస్థ ఆధ్వర్యంలో 10వేల మంది ఇంజినీరింగ్‌ విద్యార్థుకు ఏఐకి సంబంధించిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 500 ఏఐ స్టార్టప్‌లు ప్రారంభం కానున్నాయని, ఆంధ్రప్రదేశ్‌లో ఏఐకి సంబంధించి శిక్షణల ద్వారా నైపుణ్యం పెంచుకోవడంతో పాటు అనే పరిశోధనలు, ఆవిష్కణలు చేపట్టి ఏఐకి ఆంధ్రప్రదేశ్‌ ఒక ప్రపంచ కేంద్రంగా మారుతుందని పేర్కొన్నారు.

Read More
Next Story