టెట్, డీఎస్సీ అభ్యర్థులకు AP సర్కార్ గుడ్ న్యూస్
x

టెట్, డీఎస్సీ అభ్యర్థులకు AP సర్కార్ గుడ్ న్యూస్

టెట్, డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.


టెట్, డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్షలకి ప్రిపేర్ అయ్యేందుకు మరింత సమయం కావాలని అభ్యర్థులు చేసిన విజ్ఞప్తిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ప్రిపరేషన్ కి మరింత సమయం ఇవ్వాలని నిర్ణయించింది.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీ పై తొలి సంతకం చేశారు. 16,347 పోస్టుల భర్తీకి మెగా డిఎస్సీ ఫైల్ పై ఆయన తొలి సంతకం పెట్టారు. ఎన్నికలవేళ ఇచ్చిన హామీ ప్రకారం ఈ మొత్తం ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేయాలని కసరత్తు ప్రారంభించింది.

అయితే నూతనంగా బీఈడీ, డీఈడి పూర్తి చేసుకున్న వారికి టెట్ పరీక్షలకి, మెగా డీఎస్సీకి ప్రిపేర్ అయ్యేందుకు ఎక్కువ సమయం లభించదు. దీంతో వారికి మెగా డీఎస్సీ రాసేందుకు అవకాశం కల్పించేలా టెట్ నిర్వహించాలని ప్రభుత్వానికి అభ్యర్ధనలు వచ్చాయి. వీటిని పరిగణనలోకి తీసుకొని టెట్ నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీచేసింది ప్రభుత్వం.

ఇటీవల టెట్, మెగా డిఎస్సీ పరీక్షలకి సన్నద్ధం అవ్వడానికి తమకు మరింత సమయం ఇవ్వాలని అభ్యర్థులు, వివిధ విద్యార్థి, యువజన సంఘాలు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల అభ్యర్థన మేరకు మంత్రి విద్యా శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తరువాత అభ్యర్థులు పరీక్ష రాయడానికి సన్నద్ధం అవ్వడానికి టెట్ పరీక్ష నిర్వహణ కు 90 రోజులు, మెగా డిఎస్సీ నిర్వహణ కు 90 రోజుల సమయం ఇవ్వాలని నిర్ణయించింది. త్వరలోనే టెట్, డిఎస్సీ నిర్వహణకు కొత్త తేదీలను ప్రభుత్వం ప్రకటించనుంది.

Read More
Next Story