తెలంగాణ చేపమందుకు ఏపీ చేపలు
x

తెలంగాణ చేపమందుకు ఏపీ చేపలు

తెలంగాణలో ఈనెల 8 నుంచి పంపిణీ చేసేందుకు ఆంధ్ర నుంచి చేప పిల్లలు అక్కడి ప్రభుత్వం సేకరించింది. ఇవి కొరమీను చేప పిల్లలు కావడం విశేషం.


హైదరాబాద్‌లో ఉబ్బసం వ్యాధి గ్రస్తులకు చేపమందు తయారు చేసిఏ బత్తిన సోదరులకు చేప పిల్లల కొరత ఏర్పడింది. ఈ విషయాన్ని వారు తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఏపీ నుంచి చేపపిల్లలు తెచ్చేందుకు టెండర్లు పిలిచింది. పలు హేచరీచ్‌కు చెందిన వారు టెండర్లు వేశారు. ఈనెల 6న ఏపీ నుంచి హైదరాబాద్‌కు తీసుకెళతారు. ఇంకూ ఏరకం చేపలు, ఎక్కడి నుంచి తరలిస్తున్నారు?

పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని కొల్లేరు కొర్రమీను పిల్లలు (సీడ్‌) ఆస్తమా నివారణలో ఔషధంగా మారాయి. మృగశిరకార్తె రోజున హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో బత్తిన సోదరులు అందించే చేప ప్రసాదానికి కొల్లేరు ప్రాంత కొర్రమీను పిల్లలను సరఫరా కానున్నాయి. తెలంగాణ స్టేట్‌ ఫిషరీస్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీస్‌ ఫెడరేషన్‌ (టీఎస్‌ ఎఫ్సీఓఎఫ్‌) ఆధ్వర్యంలో చేప మందు ప్రసాదం నిమిత్తం టెండర్లను ఆహ్వానించింది. దాదాపు 5 లక్షల నుంచి 7 లక్షల వరకు కొర్రమీను పిల్ల అవసరమని గుర్తించారు. తెలంగాణ మత్స్యశాఖ అధికారులు కొర్రమీను సీడ్‌ అందించే సీడ్‌ ఫామ్‌లను పరిశీలించి నివేదకను అక్కడి తెలంగాణ ప్రభుత్వానికి ప్రభుత్వానికి అందించారు.
చేప పిల్లలు తెలంగాణలో నేనందు వల్లే..
చేప ప్రసాదానికి తెలంగాణలో సరిపడినన్ని చేప పిల్లలు లేకపోవడంతో ఏపీ నుంచి కొర్ర మీను పిల్లల కోసం 2024 మే 21న తెలంగాణ ప్రభుత్వం కో ఆపరేటివ్‌ సొసైటీ ద్వారా టెండర్లు ఆహ్వానించింది. కొల్లేరు ప్రాంతాలైన ఏలూరు జిల్లాలోని ముదినేపల్లి మండలం దేవపూడి ఫణిరామ్‌ ఫిష్‌ సీడ్‌ ఫామ్, ఏలూరుకు చెందిన దుర్గమల్లేశ్వర ఫిష్‌ హేచరీస్, కలిదిండి మండలం పోతుమర్రు, పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు నుంచి దుర్గ ఫిష్‌ సీడ్‌ ఫామ్‌ పాటు తెలంగాణలోని నల్గొండ, హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు కలిపి మొత్తం ఏడుగురు టెండర్లను దాఖలు చేశారు. తెలంగాణకు చెందిన ఖమ్మం జిల్లా వనపర్తి, సంగారెడ్డి జిల్లా హన్మకొండ జిల్లా మత్స్యశాఖ అధికారులకు పర్యవేక్షణ బాధ్యతను అక్కడి ప్రభుత్వం అప్పగించింది. ఖమ్మం మత్స్యశాఖ అధికారి డి అంజనేయస్వామి నేతృత్వంలో అధికారులు టెండర్లు వేసిన ఏపీలో సీడ్‌ ఫామ్‌లను పరిశీలించి ఈ నెల 25 తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందించారు.
కొరమీను చేప పిల్ల చాలా మంచిది
కొర్రమీను పిల్ల చాలా హుషారుగా ఉంటుంది. ఇది మీటరు వరకు పెరుగుతుంది. మంచినీటి సరస్సుల సస్సులు, పొలాల బోదెలు, బురద నేలల్లో ఇవి పెరుగుతాయి. వీటిలో 18–20 శాతం మాంసకృత్తులు ఉంటాయి. ఆకు కూరల్లో లభించే విటమిన్‌ ‘ఏ’ కంటే కొర్రమీనులో ఉండే విటమిన్‌ ‘ఏ’ తేలిగ్గా జీర్ణ మవుతుంది. వీటిలో గంధకం కలిగిన లైసిన్, మిథియా నిక్, సిస్టిన్‌ ఆమినో యాసిడ్లు ఉంటాయని వ్యవసాయ శాఖకు అనుబంధంగా పనిచేసే కొందరు వ్యవసాయ యూనిర్శిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మొదటి సారిగా చేపమందులో కొరమీను ప్రయోగం
ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు చేప ప్రసాదాన్ని హైదరాబాద్‌లో బత్తిన సోదరులు ఉచితంగా అందిస్తారు. కరోనా కారణంగా మూడేళ్లు ఆగిన ప్రసాదం పంపిణీ ఈ ఏడాది జూన్‌ 8న మృగశిర కార్తె ప్రారంభమయ్యే రోజు ఉదయం 11 నుంచి 9వ తేదీ ఉదయం 11 గంటల వరకు పంపిణీ చేయనున్నారు. వీరు తయారు చేసిన ప్రత్యేక మందును. కొర్రమీను పిల్ల సహా నోటిలో వేస్తారు. తెలంగాణకు సరఫరా చేసే కొర్రమీను పిల్ల సైజు 2 అంగుళాల నుంచి 3 అంగుళాలు ఉండాలి. నల్ల రం గులో హుషారుగా ఉండాలి. ప్రస్తుత మార్కెట్లో ఒక్కో కొర్రమీను పిల్ల రూ.80 ధర పలుకుతోంది.
కొరమీను చేప పిల్లల సేకరణ పెద్ద సవాల్‌..
కొర్రమీను పిల్లను సేకరించడం పెద్ద సవాల్‌గా మారుతోంది. కొల్లేరు సరస్సు, పొలాల గుంతల్లో కొర్రమీను తల్లి చేపను గుర్తిస్తారు. తల్లి వద్ద తిరిగే వేలల్లో పిల్లలను సేకరించి సిమెంటుతో చేసిన కుండీలలో ప్రత్యేకంగా పెంచుతారు. రోజుకు మూడు పూటలా నీరు మారుస్తారు. నాలుగు పూటలా మేత వేస్తారు. తెలంగాణ వరకు వ్యాన్లలో అత్యంత జాగ్రత్తగా వీటిని రవాణా చేస్తారు. కొల్లేరు ప్రాంతాల నుంచి వెళ్లే వ్యాన్లలో పిల్లలకు మూడు ప్రాంతాల్లో నీటిని మార్పు చేస్తారు. చేప మందు ప్రసాదం తీసుకునే వారి కోసం 2024 జాన్‌ 6 ఉదయం హైదారాబాద్‌కు తరలిస్తారు.
కొల్లేరు ప్రాంతం అనుకూలం
చిత్తడి నేలల ప్రాంతమైన కొల్లేరు సరస్సులో సహజసిద్ధంగా కొర్రమీను పెరుగుతుంది. సల్లజాతి చేపల్లో కొర్రమీనుకు ప్రత్యేక స్థానం ఉంది. కొల్లేరు పరీవాహక ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాలకు వీటిని సరఫరా చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో కొర్రమీను సాగు సైతం చేస్తున్నారు. కొర్రమీనులో పోషకాహారాలు అధికంగా ఉంటాయి.
– షేక్‌ దానా బాషా, ఫిషరీస్‌ ఏడీ, కైకలూరు
Read More
Next Story