ఆ నియోజకవర్గాల్లోనే నేడు ఎన్నికల ప్రచారాలు
x

ఆ నియోజకవర్గాల్లోనే నేడు ఎన్నికల ప్రచారాలు

ఆంధ్ర ఎన్నికల ప్రచారాల్లో జోరు పెరిగింది. ప్రధాన పార్టీలన్నీ రాష్ట్రాన్ని చుట్టేస్తూ ప్రచారాలు చేస్తున్నారు. ఆ ప్రచారాలు ఈరోజు ఎక్కడెక్కడంటే..


ఆంధ్రలో ఎన్నికలు, ఎండలు నువ్వానేనా అన్నట్లు హీట్‌ను పెంచుకుంటూ పోతున్నాయి. ఇప్పటికే వందేళ్ల రికార్డ్‌ను ఎండలు బ్రేక్ చేయగా ఎన్నికలు బ్రేక్ చేసే రికార్డ్ మనకు జూన్ 4న తెలియనుంది. ఈ ఎన్నికలకు ఈనెల 12 పోలింగ్ జరగనుంది. పోలింగ్‌కు పట్టున పది రోజులు కూడా లేవు. దీంతో అన్ని పార్టీల వారు తమ ప్రచారంలో దూకుడు పెంచేసి. రోజుకు మూడు నాలుగు నియోజకవర్గాల్లో కలియతిరిగేస్తున్నారు. ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. మరి ఈరోజు ఎవరు ఎక్కడెక్కడ ప్రచారం చేయనున్నారంటే..

ఏఐసీపీ షర్మిల.. పోలింగ్ డేట్ దగ్గర పడటంతో తాను ఎంపీగా పోటీ చేస్తున్న కడపపై ప్రత్యేక దృష్టి సారించారు. కడప పార్లమెంటు నియోజకవర్గంలోనే తిరుగుతూ ప్రచారం చేరస్తున్నారు. అందులో బాగంగానే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు కడప డీసీసీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించి.. ప్రశ్నలు సంధించనున్నట్లు సమాచారం.

అదే విధంగా బీజేపీ కూడా తమ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఉదయం 10 గంటలకు రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ప్రత్యేక ప్రెస్‌మీట్ నిర్వహించనుంది. ఈ ప్రెస్‌మీట్‌లో బీజేపీ ప్రతినిధి సాదినేని యామిని, ఆంధ్ర టీడీపీ ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద సూర్య, జనసేన జనరల్ సెక్రటరీ శివశంకర్ పాల్గొననున్నారు. కాగా ఈ ప్రెస్‌ మీట్‌లో వారు ప్రధానంగా శాంతి భద్రతలు అనే అంశంపై చర్చించనున్నట్లు సమాచారం.

వైసీపీ అధినేత సీఎం జగన్ ఈరోజు ఉదయం 10 గంటలకు హిందూపురం నుంచి తన ప్రచారాన్ని ప్రారంభిస్తారు. హిందూపురంలోని అంబేద్కర్ సెంటర్లో ప్రత్యేక సభ నిర్వహించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:30 గంటలకు చిత్తూరు లోక్‌సభ పరిధిలో పలమనేరులో పర్యటిస్తారు. స్థానిక బస్లాండ్ సెంటర్‌లో జరిగే సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు సిటీలో పర్యటించి గాంధీ విగ్రహం సెంటర్‌లో జరిగే ప్రచార సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

Read More
Next Story