
ఏపీ డీఎస్సీకి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పోటీ
ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల్లో కూడా డిఎస్సీ పరీక్షల కోసం పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేశారు. జూన్ 6 నుంచి జూన్ 30 వరకు నెల రోజుల పాటు డీఎస్సీ పరీక్షలను నిర్వహించనున్నారు. డీఎస్సీ పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు చేయడంలో ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ నిమగ్నమైంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సీ పేరుతో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. చాల ఏళ్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగా భర్తీ కోసం నోటిఫికేషన్లు లేక పోవడంతో లక్షల సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. 5,77,675 మంది అభ్యర్థులు డిఎస్సీ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహస్తారు.
నాన్లోకల్ కింద ఇతర రాష్ట్రాల నుంచి కూడా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. 10127 మంది నాన్లోకల్ కింద దరఖాస్తులు చేసుకున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి 29244 మంది, విజయనగరం నుంచి 31060 మంది, విశాఖపట్నం నుంచి 49474, తూర్పుగోదావరి జిల్లా నుంచి 63082 మంది, పశ్చిమగోదావరి నుంచి 42523, కృష్ణా జిల్లా నుంచి 35248, గుంటూరు నుంచి 43611, ప్రకాశం జిల్లా నుంచి 35137, నెల్లూరు జిల్లా నుంచి 28806, చిత్తూరు జిల్లా నుంచి 45242, కడప జిల్లా నుంచి 29933, అనంతపురం జిల్లా నుంచి 50539, కర్నూలు జిల్లా నుంచి 73649 మంది ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తులు చేసుకున్నారు.