ఢిల్లీకి చేరుకున్న ఏపీ డీజీపీ, సీఎస్
x

ఢిల్లీకి చేరుకున్న ఏపీ డీజీపీ, సీఎస్

ఆంధ్రలో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా రాష్ట్రవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు జరగుతుండటంపై కేంద్ర ఎన్నికల సంఘం..


ఆంధ్రలో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా రాష్ట్రవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు జరగుతుండటంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలంటూ ఆంధ్ర డీజీపీ హరీష్ కుమార్, సీఎస్ జవహర్ రెడ్డికి ప్రశ్నించింది. ఈ విషయంపై ఢిల్లీలోని ప్రధాన కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని, దాంతో పాటు ఆంధ్రలోని పరిస్థితులపై సమగ్ర నివేదిక అందించాలని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ నేపథ్యంలోనే గురువారం డీజీపీ హరీష్, సీఎస్ జవహర్ రెడ్డి.. ఢిల్లీకి చేరుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల ముందు హాజరయ్యారు.

Read More
Next Story