నేడు ఏపీ కేబినెట్‌ భేటీ..కీలక అంశాలపై చర్చ
x

నేడు ఏపీ కేబినెట్‌ భేటీ..కీలక అంశాలపై చర్చ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలపనున్నారు.


ఆంధ్రప్రదేశ్‌ మంత్రి వర్గం గురువారం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్యక్షతన గురువారం ఉదయం 11 గంటలకు జరిగే ఈ కేబినెట్‌లో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.

మరి ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమరావతి పర్యటన, అమరావతి నిర్మాణాలు పునఃప్రారంభం, సభకు భారీగా తరలి వచ్చిన ప్రజలు, ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చించనున్నారు. అమరావతి పర్యటనకు వచ్చినందుకు ప్రధాని మోదీకి ఈ సందర్భంగా ఏపీ కేబినెట్‌ ప్రత్యేక ధన్యవాదలు తెలపనుంది. దీంతో పాటుగా పహల్గాం ఉగ్ర దాడులు, దానికి ప్రతీకారంగా భరత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ సింధూర్, పాకిస్తాన్‌లోని తీవ్ర వాదుల స్థావరాలను కూల్చివేయండంలో భారత భద్రత బలగాలు చూపిన తెగువ, ధైర్య సాహసాలపైన కూడా కేబినెట్‌లో చర్చించనున్నారు. శుత్రు స్థావరాలను విజయవంతంగా మట్టుబెట్టడంలో భారత సైనిక దళాలు నిర్వహించిన తీరును ప్రశంసిస్తూ ఏపీ కేబినెట్‌ వారికి అభినందనలు తెలపనుంది. ప్రస్తుతం భారత దేశంలో నెలకొన్న యుద్ధ వాతావరణంపైన కూడా చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తీర ప్రాంత భద్రతలకు తీసుకోవలసిన ప్రత్యేక చర్యలపైన కూడా చర్చించనున్నారు.
వీటితో పాటు రాజధాని అమరావతికి సంబంధించి సీఆర్‌డిఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపైన కూడా ఈ కేబినెట్‌లో చర్చించి ఆమోదం తెలపనున్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి సంక్షేమ పథకాలపైన, పలు సంస్థలకు భూములు కేటాయింపులు చేయాలనే అంశాలపైన కూడా చర్చించనున్నారు. ఇండస్ట్రియల్‌ సవర్‌ బిల్లు 2019, లేబర్‌ లాస్‌ బిల్లు 2019, ఫ్యాక్టరీస్‌ సవరణ బిల్లు 2019 వంటి పలు కీలక అంశాలపైన కూడా చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.
Read More
Next Story