భూసేకరణ నోటిఫికేషన్‌ను వెనక్కి–ఏపీ ఏపీ క్యాబినెట్‌ నిర్ణయం
x

భూసేకరణ నోటిఫికేషన్‌ను వెనక్కి–ఏపీ ఏపీ క్యాబినెట్‌ నిర్ణయం

అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న 13 బిల్లులు, వాటికి సంబంధించిన అంశాలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.


రాజధాని అమరావతి పరిధిలో ఇదివరకు 343 ఎకరాలకు సంబంధించి ఇచ్చిన భూ సేకరణ నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. శుక్రవారం రెండో రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌లో క్యాబినెట్‌ సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ మంత్రి వర్గ సమావేశంలో పలు అంశాలకు ఆమోదం తెలిపారు. లిప్ట్‌పాలసీ కింద చిన్న సంస్థల ఏర్పాటుకు భూములు కేటాయింపునకు సంబంధించి క్యాబినెట్‌లో చర్చించిన అనంతరం ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలోని పలు భూములను అగ్రికల్చర్‌ నుంచి నాన్‌ అగ్రికల్చర్‌కు కన్వర్షన్‌ ప్రతిపాదనలకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఏపీ జీఎస్టీ బిల్‌ 2025లో పలు సవరణలు చేస్తూ రూపొందించిన ప్రతిపాదనలను ఆమోదించింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో సభలో ప్రవేశపెట్టే బిల్లులకు కూడా క్యాబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

ఆగస్టు నెలాఖరులోగా అర్భన్‌ లోకల్‌ బాడీలు, అర్భన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ, ఏపీసీఆర్‌డీఏ, రాజధాని ప్రాంతం మినహాయించి అనాథరైజ్డ్‌గా నిర్మించిన భవనాలకు పీనలైజేషన్‌ విధించే ప్రతిపాదనపై మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. నాలా ఫీజు రద్దుకు మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌లోని పలు చట్టాలను సవరిస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. వైఎస్‌ఆర్‌ తాడిగడప మున్సిపాలిటీ పేరును తాడిగడప మునిపాలిటీగా మార్చే డ్రాఫ్ట్‌ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతి ప్రాంతంలో పెద్ద ప్రాజెక్టుల అమలుకు సంబంధించి ప్రత్యేక వాహక నౌకలను ఏర్పాటు చేస్తూ ఏపీ క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది. మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టం 19955, ఏపీ మున్సిపాలిటీ యాక్ట్‌ 1965 ప్రజా ప్రాతినిధ్య చట 1950ను అనుసరించి ఓటర్ల జాబితా తయారీకి మరో మూడు తేదీలను ఖరారు చేసే ప్రతిపాదనలను మంత్రి వర్గం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.
Read More
Next Story