
ఏపీ పది ఫలితాలు–ఆఖరి స్థానంలో ప్రభుత్వ పాఠశాలలు
ప్రభుత్వ పరిధిలోని పాఠశాలలు గతేడాది కంటే ఈ సారి మెరుగైన ఫలితాలను సాధించడంలో వెనుకబడ్డాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాలలో ప్రభుత్వ పాఠశాలల ఫలితాలు ఉసూరుమనిపించాయి. ప్రభుత్వ పరిధిలోని అన్ని పాఠశాలల్లో కంటే ప్రభుత్వ పాఠశాలలు అతితక్కువ ఉత్తీర్ణత శాతం సాధించి ఆఖరలో నిలిచాయి. గతేడాది కంటే ఈ విద్యా సంవత్సరంలో మరీ అధ్వాన్నంగా ఫలితాలను సాధించింది. ప్రభుత్వ పరధిలోని అన్ని పాఠశాలల కంటే గురుకుల పాఠశాలలే అత్యధిక ఉత్తీర్ణతను సాధించి మొదటి స్థానంలో నిలిచాయి.
ప్రభుత్వ ఆధీనంలోని అన్ని పాఠశాలల్లో కంటే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ పాఠశాలల్లోని విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో అగ్రస్థానంలో నిలిచారు. 95.0 శాతం ఉత్తీర్ణత సాధించి మొదటి స్థానంలో నిలిచారు. ఈ ఏడాది 3330 మంది పదో తరగతి పరీక్షలకు హాజరు కాగా, వీరిలో 95 శాతం పాసయ్యారు. గతేడాది కూడా ఇదే ఏపీ రెసిడెన్షియల్ విద్యార్థులు టాప్లోనే నిలిచారు. 3304 మంది పరీక్షలకు రాసి, 98.43 శాతం ఉత్తీర్ణత సాధించి మొదటి స్థానాన్ని దక్కించుకుంది.
ఆ తర్వాత స్థానంలో ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలలు నిలిచాయి. 94.4 ఉత్తీర్ణత సాధించి రెండో స్థానంలో నిలిచాయి. ఈ ఏడాదిలో 237176 మంది పదో తరగతి పరీక్షలు రాసి 94.4 శాతం మంది పాసయ్యారు. గతేడాది కూడా ఈ పాఠశాలల నుంచి 224935 మంది పదో తరగతి పరీక్షలు రాసి 96.72 శాతం ఉత్తీర్ణత సాధించారు.
ఆ తర్వాత స్థానంలో బీసీ వెల్ఫేర్ విద్యా సంస్థల నిలిచాయి. వీటి నుంచి 5788 మంది పరీక్షలు రాసి 95 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఆ తర్వాత స్థానంలో ఏపీ మోడల్ స్కూల్స్ నిలిచాయి. వీటి నుంచి ఈ ఏడాది 13348 మంది పరీక్షలు రాసి 84 శాతం ఉత్తీర్ణత సాధించారు. తర్వాత స్థానంలో ఏపీ సోషల్ వెల్ఫేర్ విద్యార్థులు నిలిచారు. ఈ ఏడాది 13825 మంది పరీక్షలు రాసి 89.5 శాతం ఉత్తీర్ణత సాధించారు. గతేడాది కంటే పాస్ పర్సేంటేజి తగ్గింది. పోయిన సంవత్సరం 13761 మంది పరీక్షలు రాసి 94.56 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఈ సారి మాత్రం 89.5 శాతమే మాత్రమే సాధించారు.
ఆశ్రమ పాఠశాల విద్యార్థులు తర్వాత స్థానంలో నిలిచారు. ఈ ఏడాది 10912 మంది పరీక్షలు రాసి 61.6 శాతం ఉత్తీర్ణత సాధించారు. గతేడాది కంటే ఇక్కడ కూడా బాగా పాస్ పర్సేంటేజీ తగ్గింది. పోయిన సంవత్సరం 10829 మంది పరీక్షలు రాసి 90.13 శాతం ఉత్తీర్ణత సాధిస్తే, అది ఈ ఏడాదికి 61.6 శాతానికి పడిపోయింది. కేజీబీవీ నుంచి 13097 మంది పరీక్షలు రాసి 83 శాతం పాస్ పర్సెంటేజీ సాధించారు. ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ విద్యా సంస్థల నుంచి ఈ ఏడాది 6073 మంది పరీక్షలు రాసి 67.6 శాతం ఉత్తీర్ణత సాధించగా, పోయిన సంవత్సరంలో 5735 మంది పరీక్షలు రాసి 89.64 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది పాస్ పర్సెంటేజీ బాగా తగ్గి పోయింది.
వీటన్నింటి తర్వాత జిల్లా పరిషత్, ఎయిడెడ్, మునిసిపల్, ప్రభుత్వ పాఠశాలలు నిలిచాయి. జిల్లా పరిషత్ స్కూల్స్ నుంచి ఈ ఏడాది 245753 మంది పరీక్షలు రాసి 71.9 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఎయిడెడ్ పాఠశాలల నుంచి 11076 మంది పరీక్షలు రాసి 73.3 శాతం పాసయ్యారు. ఇక మునిసిపల్ స్కూల్స్ నుంచి 31598 మంది పరీక్షలు రాసి 69.3 శాతం, 22483 మంది ప్రభుత్వ పాఠశాలల నుంచి పరీక్షలు రాసి 62.7 శాతం ఉత్తీర్ణత సాధించారు.
Next Story