సీనియర్‌ ఐపీఎస్‌ సునీల్‌కుమార్‌పై తాజాగా మరో కేసు
x

సీనియర్‌ ఐపీఎస్‌ సునీల్‌కుమార్‌పై తాజాగా మరో కేసు

సీఐడీ మాజీ చీఫ్‌ పీవీ సునీల్‌కుమార్‌పై ఆర్టికల్స్‌ ఆఫ్‌ ఛార్జ్‌ను నమోదు చేశారు.


డీజీపీ ర్యాంకులో ఉన్న ఓ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్‌ఆర్‌ ఆంజనేయులును ఇప్పటికే జైలుకు పంపిన కూటమి ప్రభుత్వం అంతే ర్యాంకులో ఉన్న మరో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌కుమార్‌ను కూడా జైలుకు పంపేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా పీవీ సునీల్‌కుమార్‌ మీద తాజాగా మరో కేసు నమోదు చేశారు. వివిధ రకాల ఆరపణలపై ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉన్న పీవీ సునీల్‌కుమార్‌ మీద సర్వీసు నిబంధనల ఉల్లంఘన అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఆర్టికల్స్‌ ఆఫ్‌ ఛార్జ్‌ నమోదు చేశారు. సర్వీసు నిబంధనల ఉల్లంఘన, వివిధ అభియోగాలతో ఆర్టికల్స్‌ ఆఫ్‌ ఛార్జ్‌ను కూటమి ప్రభుత్వం గురువారం జారీ చేసింది.

గత జగన్‌ ప్రభుత్వంలో సీఐడీ చీఫ్‌గాను, అగ్నిమాపక డీజీగాను పని చేసిన సమయంలో నిబంధనలు ఉల్లంఘించారని తేలడంతో పీవీ సునీల్‌కుమార్‌పై ఆర్టికల్స్‌ ఆఫ్‌ ఛార్జ్‌ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పీవీ సునీల్‌కుమార్‌ అనేక సార్లు విదేశాలకు వెళ్లారని ప్రభుత్వం చేపట్టిన విచాణలో తేలిందని ఈ చర్యలకు ఉపక్రమించింది. గత ప్రభుత్వ హయాంలో 2022లో జార్జియా పర్యటనకు అనుమతులు తీసుకున్న పీవీ సునీల్‌కుమార్‌ యూఏఈకి వెళ్లారనే దానిపై ఒకటి, మరో సారి ప్రభుత్వం నుంచి ఎలాంటి పర్మిషన్లు తీసుకోకుండా స్వీడన్‌ దేశానికి వెళ్లాడనే కారణం మీద రెండోది, పోస్టింVŠ లేకుండా వెయిటింగ్‌లో ఉన్న సమయంలో కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే అమెరికా దేశానికి వెళ్లాడనే కారణంతో మూడు ఛార్జ్‌ను ప్రభుత్వం నమోదు చేసింది. అంతేకాకుండా 2019లో అమెరికా వెళ్తున్నట్లు ప్రభుత్వం నుంచి అనుమతులు పొంది యూకే వెళ్లాడనే దానిపై నాలుగోది, 2021లో ప్రభుత్వానికి ఏ మాత్రం యూఏఈ వెళ్లారనే కారణంతో ఐదో ఆర్టికల్‌ ఆఫ్‌ ఛార్జ్‌ నమోదు చేశారు.
ఇవే ఆరోపణలపై పీవీ సునీల్‌ కుమార్‌ను ఇప్పటికే కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆరు సార్లు ప్రభుత్వానికి తెలియకుండా విదేశాలకు వెళ్లారనే ఆరోపణలపై ఆయనను ఇప్పటికే సస్పెండ్‌ చేసింది. అంతేకాకుండా పీవీ సునీల్‌కుమార్‌ మీద మాజీ ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజు కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో అభియోగాలు ఉన్నాయి. అయితే ఆరు సార్లు ప్రభుత్వం నుంచి అనుమతులు పొందకుండా విదేశాలకు వెళ్లారనే ఆరోపణలను కూటమి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీనిపైన విచారణ చేపట్టేందుకు సీనియర్‌ ఐఏఎస్, స్పెషల్‌ సీఎస్‌ స్థాయిలో ఉన్న ఆర్‌పీ సిసోడియా విచారణ అధికారిగా నియమించింది. ఐపీఎస్‌ అధికారులు విదేశాల పర్యటనలకు వెళ్లే ముందు చైన్‌ ఆఫ్‌ కమాండ్‌ ప్రోటోకాల్‌లను పాటించాలని, కానీ పీవీ సునీల్‌ కుమార్‌ పదే పదే నిబంధనలను ఉల్లంఘించారని, ఇది క్రమ శిక్షణా రాహిత్యంగా పరిగణించడంతో పాటుగా ఆలిండియా సర్వీసెస్‌ రూల్స్‌ కింద సస్పెండ్‌ చేస్తున్నట్లు ఇది వరకు తెలిపిన ప్రభుత్వం తాజాగా ఆర్టికల్స్‌ ఆఫ్‌ ఛార్జ్‌ను నమోదు చేసింది.
Read More
Next Story