![Andhrapradesh | ఏపీలో హ్యాపీ, పర్యాటక రంగాభివృద్ధికి చర్యలు Andhrapradesh | ఏపీలో హ్యాపీ, పర్యాటక రంగాభివృద్ధికి చర్యలు](https://andhrapradesh.thefederal.com/h-upload/2025/02/14/512891-aptourism.webp)
Andhrapradesh | ఏపీలో హ్యాపీ, పర్యాటక రంగాభివృద్ధికి చర్యలు
తెలుగు రాష్ట్రాల్లో పర్యాటక రంగానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఇద్దరు సీఎంలు నిర్ణయించారు.టూరిజం ద్వారా ఆదాయం పెంచడంపాటు ప్రజలకు ఉపాధి కల్పించాలని నిర్ణయించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎ రేవంత్ రెడ్డి, నారా చంద్రబాబునాయుడు లు ఒకే రోజు పర్యాటక రంగాభివృద్ధిపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం(Promotion of tourism sector) ద్వారా రాష్ట్ర ఆదాయం పెంచుకోవడమే కాకుండా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో (AP and Telangana)పర్యాటక రంగం పురోగమించనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని భద్రాచలం, సలేశ్వరం, రామప్ప వంటి ఆలయాలు, మల్లెల తీర్ధం,కుంటాల, బొగత జలపాతాలు, బౌద్ధ స్తూపాలు, జైన ఆలయాలు,గండికోట, సూర్యలంక, లంబసింగి, తిరుపతి, అరకులోయ, అమరావతి, విశాఖపట్టణం, నెల్లూరు ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
గండికోటను బ్రాండింగ్ చేయండి
ఆదాయ,ఉపాధి వనరుగా పర్యాటకం
తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం సమకూర్చడమే కాకుండా ఎక్కడికక్కడ యువతకు ఉపాధి కల్పించే వనరుగా పర్యాటక శాఖ ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం జరిగిన సమీక్షా సమావేశంలో కోరారు.పర్యాటకులను ఆకర్షించేలా వనరులు మనకు ఎన్నో ఉన్నా, గతంలో ప్రచారంపైన శ్రద్ధ చూపలేదు.తెలంగాణ ఘన చరిత్రను వర్తమానానికి అనుసంధానిస్తూ.. భవిష్యత్కు బాటలు వేసేలా పర్యాటక శాఖను తీర్చిదిద్దాలని సీఎం సూచించారు.పర్యాటక శాఖపై ఐసీసీసీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు.
పర్యాటక రంగానికి ప్రోత్సాహకాలు
సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రోత్సాహకాలు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్లో బోట్ హౌస్ అందుబాటులో ఉంచాలని, డెస్టినేషన్ వెడ్డింగ్లకు తెలంగాణను వేదికగా మార్చాలని సీఎం సూచించారు.భద్రాచలం, సలేశ్వరం, రామప్ప వంటి ఆలయాలు, మల్లెల తీర్ధం, బొగత జలపాతాలు, బౌద్ధ స్తూపాలు, జైన ఆలయాల్లో వసతులు మెరుగుపర్చడంతో పాటు సరైన ప్రచారం కల్పించాలని సీఎం అధికారులకు సూచించారు.
భువనగిరి కోట రోప్ వే పనులు
భువనగిరి కోట రోప్ వే పనులపైనా సీఎం ఆరా తీశారు. భూ సేకరణలో కొంత జాప్యం జరిగిందని, ఇప్పుడు భూ సేకరణ పూర్తయినందున త్వరలో టెండర్లు పిలుస్తామని అధికారులకు సీఎంకు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా భువనగిరి కోట రోప్ వే పనులకు టెండర్లు పిలవడంతో పాటు కోటపై ఉన్న చారిత్రక కట్టడాల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
అడ్వెంచర్ స్పోర్ట్స్కు ప్రాధాన్యం
పర్యాటక శాఖ పాలసీకి తుది రూపు ఇచ్చే సమయంలో అటవీ, ఐటీ, విద్యుత్, టీజీ ఐఐసీ, వైద్య, క్రీడల శాఖలతో సమన్వయం చేసుకోవాలని, ఒక శాఖ విధానాలు మరో శాఖ విధానాలకు ఆటంకంగా ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కోరారు. అడ్వెంచర్ స్పోర్ట్స్కు పర్యాటక శాఖలో ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం సూచించారు. వైద్య అవసరాలకు విదేశాల నుంచి వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పర్యాటకుల్లా వచ్చిపోయేలా అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. పర్యాటక శాఖకు బడ్జెట్ కేటాయింపులు పెరిగేలా చూస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
రాష్ట్రానికి ఆదాయం సమకూర్చడమే కాకుండా ఎక్కడికక్కడ యువతకు ఉపాధి కల్పించే వనరుగా పర్యాటక శాఖ ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి @revanth_anumula గారు చెప్పారు. ఘనమైన తెలంగాణ చరిత్రను వర్తమానానికి అనుసంధానిస్తూ.. భవిష్యత్కు బాటలు వేసేలా పర్యాటక శాఖను… pic.twitter.com/RzIMvEoRMv
— Telangana CMO (@TelanganaCMO) February 14, 2025