
‘పతంజలి మెగా ఫుడ్ పార్క్ భూములు వెనక్కు తీసుకోవాల్సిందే...’
2017 లో కారుచౌకగా మెగా ఫుడ్ పార్క్ పేరుతో భూములిచ్చారు, పార్క్ రాలేదు, చెప్పిన ఉద్యోగాలూ రాలేదు
విజయనగరం జిల్లా కొత్తవలస మండలం, చిన్నారావు పల్లి గ్రామంలో, 28-2-2017 న, GOMs No 34 (పరిశ్రమల విభాగం)ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం, పతంజలి కంపెనీ కి, APIIC వారి ఆధీనంలో ఉన్న 172.84 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. అప్పట్లో ఆ భూమి ధర, ఎకరానికి 20 లక్షల రూపాయలకు పైగా ఉన్నా, అతి చవక గా నాటి తెలుగుదేశం ప్రభుత్వం ఎకరానికి 3 లక్షల రూపాయలకు బదలాయించడం జరిగింది
అంటే, ఏడాదికి 600 కోట్ల రూపాయల లాభం గణించే పతంజలి కంపెనీకి, అటువంటి విలువైన వ్యవసాయ భూమిని రాష్ట్ర ప్రభుత్వం 30 కోట్ల రూపాయలకు పైగా రాయితీతో బదలాయించడం జరిగింది. అదే భూమిని, భూమిలేని పేద రైతులకు సాగు కోసం ఇచ్చి ఉంటే, ప్రభుత్వం వారికి జీవనోపాధిని కలిగించి ఉండేది.
GOMs No 34 ఉత్తర్వుల ఆధారంగా, APIIC వారు 3-3-2017 న ఆ భూమిని, పతంజలి కంపెనీకి, అప్పట్లో అమలులో ఉన్న ఒక కేంద్ర ప్రభుత్వ పథకం క్రింద "మెగా ఫుడ్ పార్క్" నిర్మించడం కోసం కేటాయించి, ఆ పార్క్ ను 2021 మార్చి లోపల నిర్మించాలనే నిబంధన విధిస్తూ ఆదేశాలు ఇచ్చారు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన "మెగా ఫుడ్ పార్క్" పథకం క్రింద, పతంజలి కంపెనీ ఎటువంటి ఆమోదం పొందలేదు. పతంజలి కంపెనీ, ఈరోజు వరకు, అంటే ఏడేళ్లకు పైగా, "మెగా ఫుడ్ పార్క్" విషయంలో ఎటువంటి నిర్మాణ కార్యక్రమం చేపట్టలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన "మెగా ఫుడ్ పార్క్" పథకం, 2021 ఏప్రిల్ నెల నుంచి అమలులోకూడా లేదు.
పతంజలి కంపెనీ, ఎన్నో రాష్ట్రాల్లో, పెద్ద ఎత్తున భూ సేకరణ చేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారాల కారణంగా, జాతీయస్థాయిలో వివాదాలకు గురి అయింది అదే కాకుండా, నేపాల్ దేశంలో కూడా, పతంజలి కంపెనీకి భూమిని కేటాయించిన ఒక పూర్వ ప్రధాన మంత్రి గారి మీద దర్యాప్తు జరిగింది. ఆపైన ఆయన శాసనసభ్యత్వానికి అంతరాయం
GOMs No 34 ఆధారంగా, APIIC వారు 3-3-2017 జారీ చేసిన ఆదేశాలను అనుసరించి పతంజలి కంపెనీ 2021 మార్చి ముందు, చిన్నారావు పల్లి లో మెగా ఫుడ్ పార్క్ నిర్మించి, 6,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సి ఉంది. కాని, ఆ కంపెనీ అటువంటి నిబంధనను అమలు చేయలేదు. ఆ కారణంగా, ప్రభుత్వం GOMs No 34 ను రద్దు చేసి, 172.84 ఎకరాల భూమిని, తక్షణం, వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది.
మొదట్లో ఆ భూమిని, D పట్టాల కింద చిన్నకారు రైతులు సాగు చేస్తూ ఉపాధి పొందేవారు. అటువంటి భూములను APIIC వారు ఆక్రమించడం ప్రశ్ననీయం. భూములు కోల్పోయిన అదే D పట్టాదారులు కొందరు ఈ రోజు కూడా, ఆ భూములను, సాగు చేస్తున్నారు. GOMs 34 రద్దు చేసి వెనక్కి తీసుకున్న భూమిని అటువంటి చిన్నకారు రైతులకు, ఇతర భూమిలేని వ్యవసాయదారులకు కేటాయిస్తే, వారికి ఉపాధి కలుగుతుంది.
గ్రామాల్లో ప్రభుత్వ భూములను ప్రైవేట్ కంపెనీలకు కేటాయించడం చట్టవిరుద్ధమని సుప్రీమ్ కోర్టువారు 2011 జనవరి 28న జగపాల్ సింగ్ కేసులో రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పతంజలి కంపెనీకి చిన్నరావుపల్లి లో ప్రభుత్వ భూమిని 2017 లో బదలాయించడం ఆ ఆదేశాలను ఉల్లంఘించడం అయింది అని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి.
చిన్నారావు పల్లి లో పతంజలి కి బదలాయించిన భూముల మార్కెట్ ధర ఎకరానికి 20 లక్షల రూపాయలకు పైగా ఉన్నా, ప్రభుత్వం, ఆభూములను, ఎకరానికి 3 లక్షల రూపాయలకు మాత్రమే అమ్మడం ప్రజా విశ్వాసానికి విరుద్ధంగా వ్యవహరించినట్లు అవుతుందని, అటువంటి నిర్ణయం తీసుకున్న రాజకీయ నేతల మీద, అధికారుల మీద చర్యలు తీసుకోవాలని, సుప్రీమ్ కోర్టువారు 2G స్పెక్ట్రమ్, బొగ్గు కుంభకోణాల కేసులలో అభిప్రాయపడ్డారు.
గత రెండు మూడు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు, విచక్షణారహితంగా ప్రభుత్వ భూములను, ఖనిజాలు, ఇతర ప్రకృతి వనరులను, ప్రైవేటు కంపెనీలకు చవక ధరలకు బదలాయించడం జరిగింది. అటువంటి నిర్ణయాలు రాజ్యాంగ విలువలకు, చట్టాలకు, సుప్రీం కోర్టు ఆదేశాలకు వ్యతిరేకం.
ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ నాయకులు, అధికారులు ప్రజలకు జవాబుదారీగా ఉండడం అవసరం.
మీద సూచించిన విషయాలను గుర్తించి, రాష్ట్ర ప్రభుత్వం విజయనగరం జిల్లా కొత్తవలస మండలం, చిన్నారావు పల్లి గ్రామంలో పతంజలి కంపెనీకి, చవకగా 172.84 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయిస్తూ జారీచేసిన GOMs No. 34 ను రద్దు చేసి, ఆ భూములను వెనక్కి తీసుకుని, ప్రస్తుతం ఆ భూములు సాగు చేస్తున్న SC/ST/OBC చిన్నకారు వ్యవసాయదారులకు, ఇతర భూములు లేని పేద ప్రజలకు, D పట్టాలు ఇచ్చి, వారికి ఉపాధి కలిగించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
అటువంటి చర్యలు తత్ క్షణం చేపట్టకపోతే, అందుకు బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకోవడం కోసం, ప్రజలు కోర్టులను ఆశ్రయించవలసి వస్తుంది అని
(ఈ విషయాలను లేఖ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కి తెలియచేయం జరిగింది)