జనసేన వెంటే అంబటి.. ప్రచారంలో జోరుగా..
x

జనసేన వెంటే అంబటి.. ప్రచారంలో జోరుగా..

జనసేన ప్రచార ర్యాలీలో క్రీడాకారుడు అంబటి రాయుడు పాల్గొన్నాడు. అంతేకాకుండా సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.


ఆంధ్ర ఎన్నికలు రోజురోజుకూ మరింత రసవత్తరంగా మారుతూ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించిన కిక్కిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అంచనాలకు కూడా అందడం లేదు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. అదే జనసేన ప్రచార ర్యాలీలో టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు పాల్గొనడం. అంతేకాకుండా జగన్‌కు ఓటేయొద్దని కూడా ఓటర్లు కోరాడు. ఎన్నికలకు రెండు వారాలు కూడా సమయం లేని సమయంలో ఒక్కసారిగా జనసేన తరపున ప్రచారంలో అంబటి రాయుడు పాల్గడనం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ ప్రచార ర్యాలీలో అంబటి వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారింది. జగన్‌కు మరోసారి ఓటేస్తే రాష్ట్రాం అదఃపాతాళానికి పడిపోతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు అంబటి రాయుడు.

వైసీపీలో అంతా బానిసత్వమే

‘‘వైసీపీలో ఉంటే ప్రజాసేవ చేయలేం. ఆ పార్టీలో బానిసత్వం తప్ప మరే ఉండదు. ఆ విషయం తెలుసుకునే చేరిన వారానికల్లా బయటకు వచ్చేశాను. ఆ పార్టీలో ఎంపీ, ఎమ్మెల్యే పదవి ఏదైనా జగన్ కాళ్ళకింద చెప్పులానే బతకాలి. జగన్ నిర్వీర్యం చేయని రంగం లేదు. ఆఖరికి క్రీడారంగం కూడా జగన్ చేతుల్లో పడి నాశనమైంది. ఈ ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలి’’అని ప్రజలకు పిలుపునిచ్చారు.

Read More
Next Story