ఏపీకి వాయుగుండం ముప్పు
x

ఏపీకి వాయుగుండం ముప్పు

ఏపీకి వాయుగుండం ముప్పు పొంచి ఉంది. పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు.


నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా అల్పపీడనం బలపడింది. వాయువ్య దిశగా గంటకు 10కిమీ వేగంతో కదులుతున్నది. చెన్నైకి 440కిమీ, పుదుచ్చేరికి 460కిమీ, నెల్లూరుకి 530కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. గురువారం తెల్లవారుజామున చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో బుధవారం పలు ప్రాంతాల్లో విసృతంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయి. దక్షిణకోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు, పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురువారం కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40–60కిమీ వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. దీంతో మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Read More
Next Story