జగన్‌కు భారీ షాక్‌–పొదిలి ఘటనలో 15 మంది అరెస్ట్‌
x

జగన్‌కు భారీ షాక్‌–పొదిలి ఘటనలో 15 మంది అరెస్ట్‌

ఈ అంశంలో నిబంధనలు ఉల్లంఘించారంటూ ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డికి ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేశారు.


మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీకి మరో బిక్‌ షాక్‌ తగిలింది. పొదిలి ఘటనలో టీడీపీ శ్రేణులపైన, మహిళలపైన దాడికి పాల్పడ్డారంటూ 15 మంది వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. జగన్‌ పొదిలి పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డికి ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేశారు. సీసీకెమేరాల్లో రికార్డు అయిన విజువల్స్‌ ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తిస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనలో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా మరో 15 మందిని అరెస్టు చేశారు. శనివారం అరెస్టు చేసిన ఈ 15 మందిని వైద్య పరీక్షల కోసం పొదిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం పొదిలి కోర్టులో హజరు పరచనున్నారు.

ఈ నెల 11న మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పొదిలి పర్యటన చేశారు. పొదిలిలోని పొగాకు వేలం కేంద్రానికి వెళ్లారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు, వైసీపీ శ్రేణులు తరలి వచ్చారు. ఇదే సయమంలో సాక్షి టీవీలో అమరావతి మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని, క్షమాపణలు చెప్పాలని, టీడీపీ శ్రేణులు, మహిళల జగన్‌ రాకను నిరసిస్తూ ప్లకార్డులు, నల్లబెలూన్లు పట్టుకొని నిరసనలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వారిపైన, భద్రత కోసం వచ్చిన పోలీసుపైన గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు, చెప్పులు విసిరారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళలతో పాటు మరో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు.
దీనిపైన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌ సీరియస్‌ అయ్యారు. అదే రోజు రాత్రి డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా, ఇతర సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులతో తన క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఘటన గురించి ఆయన ఆరా తీశారు. ఘటనకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవలని ఆదేశించారు. ఈనేపథ్యంలో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీకెమేరాలలో రికార్డు అయిన విజువల్స్‌ పరిశీలించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ముఖాలను క్షుణ్ణంగా పరిశీలించి, నిర్థారణకు వచ్చిన తర్వాత వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.
ఇదే ఘటనపై శనివారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. ప్రజల గొంతును అణచి వేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని విమర్శించారు. పొదిలి ఘటనలో దాడులకు పాల్పడేలా టీడీపీ శ్రేణులను ఉసికొల్పంది చంద్రబాబేనని, ఆయన ఆధ్వర్యంలోనే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు.
Read More
Next Story