
A wall collapse at Simahachalam Temple
సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో గోడకూలి 8 మంది మృతి
విశాఖ జిల్లా సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఓ గోడ కూలి 8 మంది కన్నుమూశారు.
విశాఖ జిల్లా సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఓ గోడ కూలి 8 మంది కన్నుమూశారు. ఏప్రిల్ 30 బుధవారం వరహా లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం సందర్భంగా నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలింది. ఈ దుర్ఘటనలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారు. రూ. 300 టికెట్ కౌంటర్ (300 rupees ticket Counter) దగ్గర గాలి, వానకు గోడ కూలిపోయింది (wall collapse). ఈ ఘటనలో ఏడుగురు భక్తులు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటన ప్రదేశానికి చేరుకున్న రిస్క్యూ సిబ్బంది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు చేపట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న హోంమంత్రి అనిత, జిల్లా కలెక్టర్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా, మృతదేహాలను కేజీహెచ్ ఆస్పత్రికి తరలిస్తున్నారు.
సింహాచలం చందనోత్సవం వేళ భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో భారీ గోడ కూలింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. ప్రసాదం స్కీం కింద అక్కడ గోడ నిర్మించారు. అక్కడ డెవలప్మెంట్ చేస్తున్నారు. అందులో భాగంగా గోడ కట్టారు. ఆ గోడ పక్కనుంచే రూ. 3 వందల టిక్కెట్ లైన్ ఉంది. బుధవారం తెల్లవారుజాము 2:30 గంటల సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో గోడ కూలింది. ఆ ప్రక్క నుంచి క్యూ లైన్ నుంచి వెళుతున్న భక్తులపై గోడ పడింది. క్షతగాత్రుల తరలింపుకు 17 అంబులెన్సులు ఏర్పాటు చేశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి అనగాని..
సింహాచలంలో గోడకూలిన ఘటనపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. భారీ వర్షాలు, ఈదురుగాలులకు గోడ కూలి ఏడుగురు భక్తులు చనిపోవడం, పలువురు గాయపడడం తీవ్రంగా బాధించిందన్నారు. గోడ కూలిన ప్రాంతంలో సహాయక చర్యలను మంత్రులు, అధికారులతో కలిసి పర్యవేక్షిస్తున్నామని, చనిపోయిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని మంత్రి చెప్పారు. భక్తులు భయపడాల్సిన అవసరం లేదని, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పెద్ద ఎత్తున సహాయక చర్యలు నిర్వహిస్తున్నాయన్నారు.
సహాయక చర్యలను పర్యవేక్షించిన హోంమంత్రి
సింహాచలంలో గోడకూలిన ఘటన స్థలంలో పరిస్థితిని సమీక్షిస్తున్నామని, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నామని హోంమంత్రి అనిత తెలిపారు. సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ క్యూలైన్పై సిమెంట్ గోడ కూలిందన్నారు. ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్, పోలీస్ శాఖ సిబ్బంది నేతృత్వంలో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు ఏర్పాట్లు చేశామన్నారు. అలాగే జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని హోం మంత్రి తెలిపారు.
మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురిసింది. దీంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ క్యూలైన్పై సిమెంట్ గోడ కూలింది. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. హోంమంత్రి వంగలపూడి అనిత, విశాఖ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
నిజరూపంలో దర్శనమిస్తున్న అప్పన్న..
వరహా లక్ష్మీ నరసింహస్వామి భక్తులకు నిజరూపంలో దర్శనమిస్తున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు ఇప్పటికే భారీ ఎత్తున సింహగిరికి పోటెత్తారు. వేకువజామున ఒంటిగంటకు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపారు. అనంతరం స్వామివారి దేహంపై ఉన్న చందనాన్ని వెండి బొరిగెలతో అత్యంత సున్నితంగా వేరుచేశారు. నిజరూపంలోకి వచ్చిన స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు. వైదిక కార్యక్రమాల అనంతరం ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, ఆయన కుటుంబ సభ్యులకు నిజరూప దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా వారు స్వామివారికి తొలి చందనాన్ని సమర్పించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, తితిదే పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ప్రొటోకాల్, అంతరాలయ దర్శనాలను ఏర్పాటు చేశారు.
Next Story