
ఏపీ ఈఏపీసెట్–2025లో 75.67 శాతం ఉత్తీర్ణత
67,761 మంది విద్యార్థులు అగ్రికల్చర్, ఫార్మా విగాల్లోను, 1,89,748 మంది విద్యార్థులు ఇంజినీరింగ్లోను అర్హత సాధించారు.
ఆంధ్రప్రదేశ్లో గత నెలలో నిర్వహించిన ఇంజనీరింగ్ ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సులకు ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్–2025 ఫలితాలను విడుదల చేశారు. జేఎన్టీయూ–కాకినాడ వీసీ ఆచార్య సీఎస్ఆర్కే ప్రసాద్ ఈ ఫలితాలను ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. ఏపీ ఈపీసెట్ పరీక్షల్లో 75.67 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వీసీ వెల్లడించారు.
ఏపీ ఈఏపీసెట్ పరీక్షలను మే నెలలో నిర్వహించారు. మే 19, మే 20 తేదీలలో అగ్రికల్చర్, ఫార్మా విభాగాలకు, మే 21 నుంచి మే 27 వరకు ఇంజినీరింగ్ విభాగాని పరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 145 కేంద్రాలలో పరీక్షలు నిర్వహించారు. 3,62,448 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో 3,40,300 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలకు హాజరైన వారిలో 2,57,509 మంది విద్యార్థులు అర్హత సాధించారు, అంటే పరీక్షలు రాసిన వారిలో 75.67 శాతం ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మా విభాగాలకు 89.80 శాతం, ఇంజినీరింగ్ విభాగానికి 71.65 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. పరీక్షలు నిర్వహించిన 12 రోజుల్లో ఫలితాలను విడుదల చేశామని వెల్లడించిన వీసీ.. పరీక్షలు విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
Next Story