
మూడు రోజుల్లో 40 మంది బాలికలకు విషజ్వరాలు
ఆం«ధ్రప్రదేశ్ను అతలాకుతలం చేస్తున్న అంతుచిక్కని వ్యాధులు.
ఆంధ్రప్రదేశ్ను అంతుచిక్కని వ్యాధులు, డయేరియా, విషజ్వరాలు అతలాకుతలం చేస్తున్నాయి. గుంటూరు జిల్లాలో గత ఆరు నెలలుగా అంతుచిక్కని వ్యాధుల బారిన పడి ఇప్పటికే 30మందికిపైగా ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎందుకు మరణించారో ఇంత వరకు తేలలేదు. తేల్చే పనిలో ప్రభుత్వం ఉంది. గుంటూరు అర్భన్ మండలం పరిధిలోని తురకపాలెం, చేబ్రోలు మండలం పరిధిలోని కొత్తరెడ్డిపాలెం విలవల్లాడిపోతున్నాయి. ఏ రోజు ఏ మరణ వార్త వినాల్సి వస్తోందో అని ప్రాణాలు పెట్టుకుని క్షణాలు యుగాలుగా కాలం వెల్లదీస్తున్నారు. ఇదిలా ఉంటే విజయవాడ నగరం నడిబొడ్డులో డయేరియా కలకలం రేపుతోంది. న్యూరాజరాజేశ్వరిపేటకు చెందిన వాసులు దాదాపు 120 మంది వరకు వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్తతకు గురయ్యారు. ఇప్పటికీ పాఠశాలలోనే వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్సలు అందిస్తున్నారు. అయితే ఎందుకు ఈ ప్రాంతంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తయానే దానిపై ఇంత వరకు స్పష్టత లేదు. రంగు మారిన తాగు నీటి వల్ల నగర వాసులు రోగాల బారిన పడుతున్నాని స్థానికులు ఆరోపిస్తుండగా, œ#డ్ పాయిజన్ వల్లే ఇది జరిగి ఉంటేందనే అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు.