పాలిటెక్నిక్ తొలి విడత కౌన్సిలింగ్ లో  35, 591 సీట్లు భర్తీ
x

పాలిటెక్నిక్ తొలి విడత కౌన్సిలింగ్ లో 35, 591 సీట్లు భర్తీ

పాలిటెక్నిక్ అడ్మిషన్ల తొలి విడత కౌన్సిలింగ్‌లో 35,591 మంది విద్యార్దులను ఎంపిక చేసినట్లు సాంకేతిక విద్యా శాఖ ఇన్‌ఛార్జి కమీషనర్ నవ్య తెలిపారు.


పాలిటెక్నిక్ అడ్మిషన్ల తొలి విడత కౌన్సిలింగ్‌లో భాగంగా 35,591 మంది విద్యార్దులను వివిధ కళాశాలల కోసం ఎంపిక చేసినట్లు సాంకేతిక విద్యా శాఖ ఇన్‌ఛార్జి కమీషనర్, అడ్మిషన్ల కన్వీనర్ బి నవ్య తెలిపారు. ప్రవేశ పరీక్షలో మొత్తం అభ్యర్థుల సంఖ్య 1,24,430 మంది విద్యార్ధులు అర్హత సాధించగా, 41,311 మంది విద్యార్ధులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించారని వివరించారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత 38,348 మంది విద్యార్దులు అర్హత సాధించారని, 36758 మంది విద్యార్ధులు ఐఛ్చికాలను ఎంపిక చేసుకున్నారని కన్వీనర్ వివరించారు. విద్యార్ధులు శుక్రవారం నుండి వారి ఎలాట్ మెంట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు. ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కోసం జూన్ 19 వరకు గడువు ఉన్నప్పటికీ, షేడ్యూలు ప్రకారం శుక్రవారమే తరగతులు ప్రారంభించామని విద్యార్ధులు త్వరపడాలని సూచించారు. 88 ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో కన్వీనర్ కోటా సీట్లు 17,915 ఉండగా 68 శాతం మేర 12180 సీట్లు భర్తీ అయ్యాయన్నారు. 172 ప్రవేటు పాలిటెక్నక్ లలో 62,313 సీట్లు ఉండగా, 37.5 శాతం మేర 23411 సీట్లు భర్తీ చేసామని కమీషనర్ వివరించారు. మొత్తం 260 కళాశాలల్లో 80, 228 సీట్లు ఉండగా 44.36 శాతం సీట్లు తొలివిడతలో భర్తీ అయ్యాయన్నారు.

Read More
Next Story