30 ప్రాజెక్టులు..83,437 మందికి ఉద్యోగాలు
x

30 ప్రాజెక్టులు..83,437 మందికి ఉద్యోగాలు

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 10వ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది.


రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్న పారిశ్రామిక ప్రాజెక్టులు ఫాస్ట్‌ ట్రాక్‌ లో పూర్తి కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ విధానంలో త్వరగా అనుమతులిస్తున్నామని... అదే తరహాలో ప్రాజెక్టుల గ్రౌండింగ్‌ కూడా అంతే వేగంగా జరిగేలా చూడాలని సీఎం ఆదేశించారు. సచివాలయంలో గురువారం సీఎం అధ్యక్షతన 10వ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశమైంది. రూ. 53922 కోట్ల మేర పెట్టుబడులు పెట్టే 30 ప్రాజెక్టులకు సీఎం ఆధ్వర్యంలోని ఎస్‌ఐపీబీ ఆమోదించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 83,437 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్న ప్రాజెక్టుల పురోగతిపై ఇక నుంచి ప్రతీ నెలా సమీక్షస్తానని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుల్లో స్థితిగతులపై క్షేత్రస్థాయిలో మంత్రులు కూడా పరిశీలించాలని సీఎం స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ అనుమతులిచ్చిన ప్రాజెక్టుల వివరాలను, ఉత్పత్తి ప్రారంభించేందుకు ఎంత సమయం పట్టిందన్న అంశాలను విశ్లేషించాలని సీఎం సూచించారు. మహింద్రా ఈవీ వాహనాల ఉత్పత్తి ప్లాంట్‌ ను ఏపీలో ఏర్పాటు చేసేలా తానే స్వయంగా సంప్రదిస్తున్నానని.. దీనికి అనుగుణంగా అధికారులూ స్పందించాలని సీఎం అన్నారు.

ఏపీలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలే కీలకమని.. హార్టీకల్చర్‌ హబ్‌ గా రాయలసీమతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలకు పుష్కలంగా అవకాశాలున్నాయని అన్నారు. పొరుగున తమిళనాడు, కర్ణాటకలలో ఈ తరహా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు లేవన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటు పూర్తి కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో ఆర్టీఐహెచ్‌ ద్వారా జరిగే కార్యకలాపాలను సమీక్షించాలని సీఎం సూచించారు. మరోవైపు రాష్ట్రంలోని ఆటోనగర్‌ లలో రెడ్, ఆరెంజ్‌ కేటగిరీ పరిశ్రమలకు తదుపరి అనుమతులు రాకపోవటంపై సమీక్షించిన సీఎం దీనికి తగిన కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. ఏపీకి పరిశ్రమలు రావటం ముఖ్యమన్న సీఎం.. ఇంధన ఉత్పత్తి, ఐటీ, టూరిజం, ఫుడ్‌ ప్రాసెసింగ్, మైనింగ్‌ ఆధారిత వాల్యూ చైన్‌ పరిశ్రమల్లో పెట్టుబడులు రావాల్సి ఉందన్నారు. అలాగే ఐటీ రంగంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్, కో–వర్కింగ్‌ స్పేస్‌ లను ఏర్పాటు చేయాలన్నారు.
ఎస్‌ఐపీబీ సమావేశంలో ఆమోదించిన ప్రాజెక్టులు ఇవే
1. మథర్‌ డెయిరీ లిమిటెడ్‌ రూ.427 కోట్లు పెట్టుబడులు, 180 మందికి ఉద్యోగాలు, చిత్తూరు జిల్లా.
2. ఏసీఈ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ రూ.786 కోట్ల పెట్టుబడులు, 1000 మందికి ఉద్యోగాలు, చిత్తూరు జిల్లా.
3. అపోలో టైర్స్‌ రూ.1110 కోట్ల పెట్టుబుడులు, 500 మందికి ఉద్యోగాలు, చిత్తూరు జిల్లా.
4. స్కై రూట్‌ ఎరోస్పేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.400 కోట్ల పెట్టుబుడలు, 300 మందికి ఉద్యోగాలు, తిరుపతి.
5. హెచ్‌ఎఫ్‌సీఎల్‌ రూ.1197 కోట్ల పెట్టుబడులు, 870 మందికి ఉద్యోగాలు, మడకశిర.
6. వరాహా ఆక్వా ఫారమ్స్‌ రూ.32 కోట్ల పెట్టుబడులు, 3,500 మందికి ఉద్యోగాలు, అనకాపల్లి.
7. జె.కుమార్‌ ఇన్‌ ఫ్రా ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ రూ.237 కోట్ల పెట్టుబడులు, 5000 మందికి ఉద్యోగాలు, విశాఖపట్నం.
8. అలీప్‌ సంస్థ, రూ.45 కోట్ల పెట్టుబడులు, 2,500 మందికి ఉద్యోగాలు, చిత్తూరు.
9. ఇఫ్కో కిసాన్‌ సెజ్‌ రూ.870 కోట్ల పెట్టుబడులు, 25,000 మందికి ఉద్యోగాలు, నెల్లూరు.
10. ధీరూభాయ్‌ అంబానీ గ్రీన్‌ టెక్‌ పార్క్‌ రూ.1843 కోట్ల పెట్టుబడులు, 19,000 ఉద్యోగాలు, కృష్ణపట్నం.
11. ఎన్‌.కామ్‌ వైజాగ్‌ హోటల్‌ రూ.178 కోట్ల పెట్టుబడులు, 250 మందికి ఉద్యోగాలు, భోగాపురం.
12. మంజీరా హాస్పిటాలిటీ, రూ.276 కోట్ల పెట్టుబడులు, 225 మందికి ఉద్యోగాలు, అమరావతి.
13. శ్రీ వెంకటేశ్వర లాడ్జి రూ.96 కోట్ల పెట్టుబడులు, 300 మందికి ఉద్యోగాలు, మంత్రాలయం.
14. సోలార్‌ ఎనర్జీ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ) రూ.1500 కోట్ల పెట్టుబడులు, 950 మందికి ఉద్యోగాలు, కొలిమిగుండ్ల, నంద్యాల జిల్లా.
15. సోలార్‌ ఎనర్జీ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా రూ.800 కోట్లు, 200 మందికి ఉద్యోగాలు, రామగిరి, ముత్తవకుంట్ల, సత్యసాయి జిల్లా.
16. సెరెంటికా రెన్యూవబుల్స్‌ ఆఫ్‌ ఇండియా రూ.2000 కోట్లు పెట్టుబడులు, 320 మందికి ఉద్యోగాలు, అనంతపురం.
17. సెరెంటికా రెన్యూవబుల్స్‌ ఆఫ్‌ ఇండియా రూ.2,400 కోట్ల పెట్టుబడులు, 380 మందికి ఉద్యోగాలు, కర్నూలు.
18. హెక్సా ఎనర్జీ బీహెచ్‌ ఫైవ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, రూ.1,200 కోట్ల పెట్టుబడులు, 400 మందికి ఉద్యోగాలు, కడప.
19. రెఫెక్స్‌ సోలార్‌ ఎస్పీవీ ఫైవ్‌ లిమిటెడ్, రూ.480 కోట్ల పెట్టుబడులు, 345 మందికి ఉద్యోగాలు, శ్రీ సత్యసాయి జిల్లా.
20. బ్రైట్‌ ఫ్యూచర్‌ పవర్‌ లిమిటెడ్, రూ.3,286 కోట్ల పెట్టుబడులు, 440 మందికి ఉద్యోగాలు, అనంతపురం.
21. నవయుగ ఇంజనీరింగ్‌ లిమిటెడ్, రూ.15,455 కోట్ల పెట్టుబడులు, 8,400 మందికి ఉద్యోగాలు, పాడేరు.
22. చింతా గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్, రూ.15,050 కోట్ల పెట్టుబడులు, 8,400 మందికి ఉద్యోగాలు, కడప.
23. సిర్మా ఎస్జీఎస్‌ టెక్నాలజీ రూ.1595 కోట్ల పెట్టుబడులు, 2,170 మందికి ఉద్యోగాలు, నాయుడుపేట.
24. హిందాల్కో ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ రూ.586 కోట్ల పెట్టుబడులు, 613 మందికి ఉద్యోగాలు, కుప్పం.
25. బాలాజీ యాక్షన్‌ బిల్డ్‌ వెల్, రూ.485 కోట్ల పెట్టుబడులు, 500 ఉద్యోగాలు, అనకాపల్లి.
26. అదాని విల్మర్‌ లిమిటెడ్, రూ.578 కోట్లు, 285 మందికి ఉద్యోగాలు, నెల్లూరు జిల్లా.
27. టైరోమెర్‌ టెక్నాలజీ లిమిటెడ్, రూ.85 కోట్లు పెట్టుబడులు, 120 మందికి ఉద్యోగాలు, చిత్తూరు.
28. ర్యామ్‌ శీ బయో ప్రైవేట్‌ లిమిటెడ్, రూ. 356 కోట్ల పెట్టుబడులు, 600 ఉద్యోగాలు, కడప జిల్లా.
29. శ్రీ సర్వారాయా షుగర్స్‌ లిమిటెడ్, రూ.161 కోట్ల పెట్టుబడులు, 189 మందికి ఉద్యోగాలు, కోనసీమ.
30. పట్టాభి ఆగ్రోఫుడ్స్, రూ.408 కోట్ల పెట్టుబడులు, 500 మందికి ఉద్యోగాలు, కాకినాడ.
Read More
Next Story